బాలయ్య టాక్ షో ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలుసా?

వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే రికార్డులు సృష్టించిన నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా ఆహా యాప్ ద్వారా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖ సినిమా సెలబ్రిటీలను ఆహ్వానించి వారి వ్యక్తిగత విషయాల గురించి ప్రేక్షకులకు తెలియజేయనున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమం దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కానుందని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి సీనియర్ హీరోలను కూడా ఆహ్వానించి ముచ్చటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మెగా కుటుంబం, మంచు కుటుంబం ఈ కార్యక్రమానికి అతిధులుగా వస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఇకపోతే 4వ తేదీ ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి ఎవరు వస్తారు అనే విషయం పై ఎంతో ఆతృత నెలకొంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు రానున్నట్లు సమాచారం. బాలకృష్ణ మొదటి ఎపిసోడ్ లో భాగంగా మోహన్ బాబును పలు ప్రశ్నలు అడగడనున్నట్లు తెలుస్తోంది.

ఇక నందమూరి బాలకృష్ణ మోహన్ బాబు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉందని వీరిద్దరూ ఎంతో ఆప్యాయంగా సోదర అంటూ ఒకరినొకరు పరామర్శించకుంటారనే విషయం తెలిసిందే. మరి ఈ ఎపిసోడ్లో వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ కార్యక్రమం ఎలా కొనసాగనుంది అనేది తెలియాలంటే మొదటి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.