వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే రికార్డులు సృష్టించిన నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా ఆహా యాప్ ద్వారా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖ సినిమా సెలబ్రిటీలను ఆహ్వానించి వారి వ్యక్తిగత విషయాల గురించి ప్రేక్షకులకు తెలియజేయనున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమం దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కానుందని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి సీనియర్ హీరోలను కూడా ఆహ్వానించి ముచ్చటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మెగా కుటుంబం, మంచు కుటుంబం ఈ కార్యక్రమానికి అతిధులుగా వస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
ఇకపోతే 4వ తేదీ ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి ఎవరు వస్తారు అనే విషయం పై ఎంతో ఆతృత నెలకొంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు రానున్నట్లు సమాచారం. బాలకృష్ణ మొదటి ఎపిసోడ్ లో భాగంగా మోహన్ బాబును పలు ప్రశ్నలు అడగడనున్నట్లు తెలుస్తోంది.
ఇక నందమూరి బాలకృష్ణ మోహన్ బాబు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉందని వీరిద్దరూ ఎంతో ఆప్యాయంగా సోదర అంటూ ఒకరినొకరు పరామర్శించకుంటారనే విషయం తెలిసిందే. మరి ఈ ఎపిసోడ్లో వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ కార్యక్రమం ఎలా కొనసాగనుంది అనేది తెలియాలంటే మొదటి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…