Bandla Ganesh : పూరి ఆకాష్ పూరి జగన్నాథ్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా ఇంకా ఒక హిట్ సినిమా పడి స్టాండ్ అవ్వలేదు. అయితే అంతకుముందు సినిమాల సంగతేంటో కానీ తాజాగా నేడు విడుదల కాబోతున్న ఆకాష్ పూరి కొత్త సినిమా చోర్ బజార్ సినిమా విషయంలో మాత్రం రచ్చ జరుగుతోంది. దీనికి కారణం మనం బండ్లన్నే. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన బండ్ల గణేష్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. ఈ ఫంక్షన్స్ కి ఆకాష్ పూరి కోసం పూరి జగన్నాథ్ రాకపోవడంతో బాగా డౌట్స్ వచ్చాయి అందరికి. ఇక అనుమానాలకు బలం చేకూర్చేలా మాట్లాడి బండ్ల గణేష్ అన్న మరింత రచ్చ చేసాడు.
100 కోట్లు తీసుకుంటున్న హీరోలు.. ఒకప్పుడు జోల పాడారు …
ఇక బండ్ల గణేష్ స్పీచ్ మొదటగా ఎమోషనల్ గా సాగి పూరి జగన్నాథ్ భార్య లావణ్యను భూమాత, సీతా దేవుతో పోలుస్తూ వదిన లాంటి వాళ్ళను చూడలేదంటూ, పిల్లలకోసమే తాను బ్రతుకుతోందంటూ మాట్లాడాడు. ఇక కొడుకు కోసం ముంబై నుండి రాలేవా అన్నా అంటూ పూరి జగన్నాథ్ ను ఉద్దేశించి మాట్లాడాడు. ఇక ఆకాష్ ఎప్పటికైనా గొప్ప స్టార్ హీరో అవుతావని, మీ నాన్న ఎంతో మందిని మెగాస్టార్లను, సూపర్ స్టార్లను చేసాడు. డైలాగులు రాని వాళ్లను ఈరోజు పెద్ద స్టార్లను చేసాడు. ఈరోజు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ 100 కోట్లు తీసుకుంటున్న హీరోలు నీ కోసం రారు, ఒకప్పుడు నీకు జోల పాడిన వాళ్ళు ఇప్పుడు నీకోసం నీ సినిమా ప్రచారానికి రారు. ఎందుకంటే వారికి భయం నువ్వు ఎక్కడ పెద్ద స్టార్ హీరో అయ్యి వారికి పోటీ వస్తావో అని అంటూ మాట్లాడాడు బండ్ల గణేష్. అయితే ఈ మాటలు ప్రభాస్ ను ఉద్దేశించి అని ప్రభాస్ అభిమానులు మండిపోతున్నారు.
దీనికి కారణం దాదాపు 100 కోట్లు తీసుకుంటున్న హీరో ఇపుడు టాలీవుడ్ లో ప్రభాస్ మాత్రమే. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ పై ఫైర్ అవుతున్నారు. ప్రభాస్ తో పూరి తీసిన రెండు సినిమాల్లో ఒకటి యావరేజ్ అయితే మరోకటి ప్లాప్ సినిమా, తానేమీ పెద్ద స్టార్ ని చేయలేదు. అయినా ప్రభాస్, ఆకాష్ పూరి సినిమా రొమాంటిక్ ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడారు ఒకరోజంతా ఆకాష్ కోసం కేటాయించారు. అలాంటప్పుడు బండ్ల గణేష్ ఇలా ఎలా మా హీరోని టార్గెట్ చేసి మాట్లాడుతారు అంటూ ఫైర్ అవుతున్నారు ప్రభాస్ అభిమానులు. దీనికి బండ్లన్న ఏం సమాధానం చెబుతాడో చూడాలి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…