పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయిస్తున్నారా? అయితే తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా Tenaliలో వెలుగుచూసిన కేసు స్థానికంగా కలకలం రేపింది.
Kollipara మండలం కొత్తూరు లంకకు చెందిన ఆరవపల్లి వంశీ అనే వ్యక్తి, తనకు ఇప్పటికే విడాకులు అయ్యాయని చెప్పి ఒక ప్రైవేట్ ఉద్యోగినితో మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. బాధితురాలి ఆఫీసుకు వెళ్లడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటి చర్యల ద్వారా పూర్తి నమ్మకం సంపాదించాడు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి, టిప్పర్ కొనుగోలు చేయాలంటూ ఆమె పేరుతో సుమారు రూ.12.20 లక్షల వరకు అప్పులు చేయించాడు. ఆ తర్వాత మరింత డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో బాధితురాలు నిరాకరించింది.
దీంతో నిందితుడు అసలు స్వరూపం బయటపెట్టి, ఆమెపై దాడి చేయడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించి, వ్యక్తిగత వివరాలు బయటపెడతానని బెదిరింపులకు దిగాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు Tenali త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఫోన్ డేటా పరిశీలనలో ఇతడు ఇప్పటికే మరికొంతమంది మహిళలను కూడా ఇదే విధంగా మోసం చేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు.
మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయమయ్యే వ్యక్తుల గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లోకి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా తీసుకోవడం, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వివాదం చివరకు హత్యకు దారితీసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం…
యంగ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన రాకాస సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తోంది. విడుదలైన…
తమిళ బుల్లితెర రంగంలో గుర్తింపు పొందిన నటి సుభాషిణి మృతి వార్త సినీ, టీవీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.…
టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడికు నిర్మాత దిల్ రాజు నుంచి ఆసక్తికర ఆఫర్ రావడం ఇండస్ట్రీలో…
టాలీవుడ్, బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నటి జాన్వీ కపూర్ తన టీనేజ్లో ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా…
తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్గా కొనసాగుతున్న త్రిష కృష్ణన్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులు చర్చనీయాంశంగా మారాయి.…