షణ్ముఖ్ పాలప్యాకెట్లు ఎత్తుకుపోయేవాడు.. యూట్యూబర్ పై మండిపడిన అఖిల్..!

అఖిల్ సార్దక్.. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. ఇదిలా ఉండగా 12 వ వారంలో యాంకర్ రవి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

అతడు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడి ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. ఫేక్ ఎలిమినేషన్ చేశారంటూ.. బిగ్ బాస్ పై చిర్రెత్తిపోతున్నారు. పింకీ, సిరి కంటే తక్కువగా యాంకర్ రవికి ఓట్లు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిలో కూడా ప్రాంతీయ బేధం చూపించారని తెలంగాణ జాగృతి సభ్యులు ఆరోపించారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లు బాగానే ఉన్నారు కానీ.. బయట ఫ్యాన్స్ మాత్రం ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు.

తాజాగా ఓ యూట్యూబర్‌ షణ్ముఖ్‌పై దారుణ వ్యాఖ్యలు చేశాడు. ‘షణ్నును ఎక్కడో చూసినట్లుంది… పొద్దున్నే పాల ప్యాకెట్లు ఎత్తుకుపోయేది, కాగితాలు ఏరుకునేది మీరే కదా గుర్తుపట్టాను, మీ ముఖం అయితే 5 పైసలు ఉంటది. కాగితాలు ఏరుకునేటోడు ఓ రాయి పట్టుకుని కుక్కల వెనకాల తిరుగుతుంటడు చూడు.. వాడు సేమ్‌ నీలాగే ఉంటడు షణ్ను..’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వీడియోను అఖిల్‌ సార్థక్‌ తన ఇన్ స్టాలో ట్యాగ్ చేసి ఇలా అన్నాడు.

గేమ్ ను గేమ్ లాగే చూడండి.. దయచేపి తప్పుగా మాట్లాడకండి అంటూ అన్నాడు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ను గెలిపించుకోవడం కోసం అవతలి వాళ్లను కించపరచడం అనేది తప్పు అంటూ అతడు చెప్పుకొచ్చాడు. దీనిపై దీప్తి సునయనా స్పందించారు. షణ్ముఖ్ జశ్వంత్ కొరకు స్టాండ్ తీసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా హౌస్ లో కంటే..ఫ్యాన్స్ మధ్యే హీట్ విపరీతంగా పెరిగిపోతోంది.