నందమూరి బాలకృష్ణ హోస్టగా చేస్తున్న ప్రోగ్రాం అన్ స్టాపాబుల్. ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ షోతో ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ప్రోమోలతోనే పిచ్చెక్కించిన బాలయ్య.. అంత బాగా హోస్ట్ చేస్తారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. అందరి అంచనాలను తారుమారు చేశారు.
ఎప్పుడూ బాలయ్య గురించి వార్తలు వచ్చినా.. సినిమాల గురించే మాట్లాడుకునే వాళ్లు.. కానీ గత రెండు మూడు వారాల నుంచి ఈ షో గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణలో ఈ యాంగిల్ కూడా ఉందనేది ఈ షో ద్వారానే తెలిసింది. దీంతో అతడి పాపులారిటీ అంతకు అంత పెరిగిపోయింది. దీంతో అతడికి అల్లు ఫ్యామిలీ బంధం ఇంకా మెరుగుపడింది.
అందుకే ఇటీవల అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ను గెస్ట్ గా పిలిచారు. ఇటీవల బాలయ్య చేతికి సర్జరీ జరగడంతో డాక్టర్స్ విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. దీంతో షో కి కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది. శుక్రవారం తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ‘మరింత ఉత్సాహంతో, రెట్టింపు ఎనర్జీతో బాలయ్య బాబు ఈజ్ బ్యాక్’ అంటూ ‘ఆహా’ టీం మూడో ఎపిసోడ్లో బాలయ్య పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఫస్ట్ ఎపిసోడ్లో మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీలతో సందడి చేసిన బాలయ్య.. రెండో ఎపిసోడ్లో నేచురల్ స్టార్ నానితో హంగామా చేశారు. ఇక నిన్న ఈ షోకి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. దానిలో బాలయ్య ఇలా చెబుతూ మొదలవుతుంది.. ‘మూడు వారాలు గ్యాప్ వచ్చింది.. ఎన్నో మెసేజెస్, ఎన్నో ఫోన్ కాల్స్.. నేనెలా ఉన్నానని కాదు.. మూడో ఎపిసోడ్ ఎప్పుడా అని.. వారం వారం రావడానికి నేను సీరియల్ని కాదు.. సెలబ్రేషన్’.. అంటూ బాలయ్య తన స్టైల్ ఎనర్జీతో అలరించారు. త్వరలో మూడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ వారం గెస్ట్ ఎవరనే దానిపై ప్రతి ఒక్కరికీ ఉత్కంఠగా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…