Pallavi prashanth: 35 లక్షల గెలిచిన ప్రశాంత్ రైతులకు అంత తక్కువ పంచుతున్నారా.. అసలేం జరిగిందంటే?

Pallavi prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక రైతు బిడ్డగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయనకు భారీ స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అవ్వడమే కాకుండా టైటిల్ విన్నర్ గా నిలిచినటువంటి ఈయనకు 35 లక్షల రూపాయల ప్రైస్ మనీతో పాటు ఒక డైమండ్ నెక్లెస్ అలాగే కారు కూడా బహుమానంగా వచ్చిన సంగతి తెలిసిందే అయితే తాను గెలిచిన ఈ డబ్బును పేద రైతులకు సహాయంగా ఇస్తానని గతంలో ప్రశాంత్ ప్రకటించారు.

ఇప్పటివరకు ఈ సహాయం చేయకపోవడంతో మాట తప్పారు అంటూ ఈయన పట్ల విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ విమర్శలపై పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను ప్రాణం పోయిన ఇచ్చిన మాట తప్పనని పల్లవి ప్రశాంత్ తెలిపారు. త్వరలోనే రైతులకు ఇవ్వాల్సిన డబ్బును మొత్తం ఇవ్వబోతున్నానని తెలిపారు.

ప్రాణం పోయినా మాట తప్పను..

ఈయన 35 లక్షల రూపాయలు గెలుచుకోగా టాక్స్ కట్ అవుతూ ఈయనకు కేవలం 16 లక్షల రూపాయలు మాత్రమే చేతికి అందిందని ఈ పదహారు లక్షల రూపాయలను మాత్రమే పల్లవి ప్రశాంత్ రైతులకు పంచ బోతున్నారని తెలుస్తుంది. ఇక ఈయన బిగ్ బాస్ గెలిచిన తర్వాత ఇతర బుల్లితెర కార్యక్రమాలలో బిజీగా గడుపుతూ ఉన్నారు.