Bjp Leader Raghunandan rao : ఒకప్పుడు కెసిఆర్ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేవాడిని…: బీజేపీ నేత రఘునందన్ రెడ్డి

Bjp Leader Raghunandan rao : తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న లీడర్ రఘునందన్ రావు గారు సిద్ధిపేట జిల్లా వాసి. ఆయన కెసిఆర్ కి బంధువే. మూడు దశాబ్దాల పాటు కెసిఆర్ తో తిరిగిన ఆయన తెరాస నుండి బయటికి వచ్చి ప్రస్తుతం బీజేపీ లో ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలిచిన ఆయన స్వతహాగా న్యాయవాది. అసదుద్ధిన్ ఓవైసి బెయిల్ పిటిషన్ అపుడు బాగా ఫేమస్ అయ్యారు. ఇక కెసిఆర్ తో ఆయనకున్న అనుబంధం అలాగే పార్టీని వీడి రావాల్సిన పరిస్థితుల గురించి రఘునందన్ మాట్లాడారు.

కెసిఆర్ బట్టలను ఉతికా…

రఘునందన్ గారికి కెసిఆర్ బంధువు అలాగే 1983 లో కెసిఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయంలో ఇంటర్ చదువుతున్న రఘునందన్ గారు తన కన్నా పెద్ధ అయినా కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారట. ఆ సమయంలోని ఆయనతో సన్నిహితంగా ఉండే రఘునందన్ గారు కెసిఆర్ గారి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేవారట. కెసిఆర్ గారు పార్టీ స్థాపించి తెలంగాణ కోసం పోరాడిన సమయంలో కూడా ఆయనతోనే ఉన్న రఘునందన్ గారు దాదాపు 30 ఏళ్ళు ఆయనతో కలిసి ఉన్నానని నన్ను చెప్పుడు మాటలను విని పార్టీ నుండి బయటకు పంపేసారని చెప్పారు.

కాలేజీ లో చదివే సమయంలో ఏబివిపి సమావేశాలకు ఒకసారి వెంకయ్య నాయుడుగారు వచ్చి మా కాలేజీ లో స్పీచ్ ఇచ్చినపుడు నేను అలా మంచి లీడర్ గా ఎదగాలని అలా అనర్గళంగా మాట్లాడాలగలగాలి అని అనుకునేవాడిని అంటూ అందుకే కెసిఆర్ దగ్గరి నుండి బయటికి వచ్చాక బీజేపీ లో చేరానని పార్టీ తరుపున ప్రజలకు మరింత చేరువవుతున్నానని తెలిపారు.