Category Archives: devotional

Mahesh Babu: మహేష్ బాబు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. నమ్రత కూడా కాదంట తెలుసా?

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన త్వరలోనే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా రాజమౌళి సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే మహేష్ బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈయన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరి సరసన నటించారు. ఈ క్రమంలోనే మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఈ హీరోయిన్లతో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకుంటారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ మళ్లీ మళ్లీ హీరోయిన్లతో షేర్ చేసుకోవాల్సి వస్తే షేర్ చేసుకుంటానని తెలిపారు. త్రిషతో నటించడం చాలా సులభంగా ఉంటుందని అంతేకాకుండా తనతో నా స్క్రీన్ స్పేస్ బాగుంటుందని తెలిపారు. ఇలా మా ఇద్దరి మధ్య సీన్స్ అద్భుతంగా ఉండడానికి కారణం మా ఇద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అని ఈయన తెలిపారు.

ఫ్రెండ్షిప్ కారణం…
ఇక త్రిష తర్వాత సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తాను ఇష్టపడతానని తెలిపారు. అయితే ఈయన భార్య నమ్రత కూడా హీరోయినే, ఈమెతో కలిసి కూడా మహేష్ బాబు సినిమాలలో నటించారు కానీ ఈయన మాత్రం తన భార్య పేరు చెప్పకుండా త్రిష సమంత అంటూ తనకి ఇష్టమైనటువంటి హీరోయిన్లు మళ్లీమళ్లీ సినిమాలలో నటించాలనుకునే హీరోయిన్ల గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Donates: ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు కనుక ఇచ్చారో అప్పలపాలు అయినట్టే?

Donates: సాధారణంగా మనం ఏదైనా పండుగల సమయంలోను లేదా ఎప్పుడైనా ఇతరులకు దానధర్మాలను చేస్తూ ఉంటాము. ఇలా ఇతరులకు మనం చేసే దానధర్మాల వల్ల వారు సంతోషించినప్పుడే మనం చేసిన దాన పుణ్యఫలం మనకు దక్కుతుంది. అందుకే పెద్ద ఎత్తున మన ఆర్థిక స్థోమతకు అనుకూలంగా దాన ధర్మాలను చేస్తూ ఉంటాము. అయితే కొన్నిసార్లు మనం మన ఇంటికి వచ్చిన వారికి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యానికి బదులు పాపం కలుగుతుంది.

ఇంటికి వచ్చినటువంటి వారికి మనం ఎప్పుడూ కూడా చిరిగిపోయిన బట్టలను అలాగే పాడైపోయినటువంటి ఆహార పదార్థాలను లేదా లోహపు వస్తువులను పొరపాటున కూడా దానం చేయకూడదు. ఇలా ఈ వస్తువులు కనుక ఇచ్చాము అంటే దానం చేసిన పుణ్యఫలం ఏమో కానీ పెద్ద ఎత్తున పాపం రావడమే కాకుండా లక్ష్మీదేవి ఆగ్రహానికి కూడా గురి కావాల్సి ఉంటుంది.

పుణ్యం కలుగుతుంది..

అందుకే పొరపాటున కూడా ఇలాంటి వస్తువులను పేదవారికి గాని ఇతరులకు కానీ దానం చేయకూడదు ముఖ్యంగా కొబ్బరి నూనెను కూడా మనం ఇతరులకు ఎప్పుడు దానం చేయకూడదు. మనం ఇతరులకు పెట్టే ఆహార పదార్థమైన ఇచ్చే దుస్తులు వల్ల అయినా కూడా వారు సంతోషంగా ఉన్నప్పుడే ఆ దానం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది అంతేకాకుండా మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిరిసంపదలు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Lakshmi Devi: ఇలాంటి సంకేతాలు మీకు కనబడుతున్నాయా… మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే?

Lakshmi Devi: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి కరుణ కటాక్షాల కోసం ఎన్నో రకాల పూజలు వ్రతాలు హోమాలు చేస్తూ ఉంటారు. మనం కష్టపడి సంపాదించిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలని ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంది అంటే మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సంకేతాలు కనుక మనకి ఎదురవుతూ ఉంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉన్నట్టే.

మన ఇంటి ఆవరణంలో కోకిల తరచూ కూస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం అయితే ఉదయం సమయంలో ఆగ్నేయ మూలలో కోయిల కూస్తూ ఉంటే అది అశుభానికి సంకేతం కానీ సంధ్య సమయంలో ఆగ్నేయ దిశగా కోయిల కూస్తూ ఉంటే మంచిది. అలాగే మామిడి చెట్టుపై కోయిల కూస్తూ ఉంటే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని అర్థం.

ఇకపోతే నల్ల చీమలు ఇంట్లో కనపడితే అది లక్ష్మీదేవి రాకను చూచిస్తుంది ముఖ్యంగా చీమలు బియ్యాన్ని కనుక తీసుకు వెళుతూ ఉన్నట్టయితే మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని అర్థం. ఇక బల్లి కూడా మనపై అనుకోకుండా పడితే అది కూడా అదృష్టమని కానీ కుడి వైపు బల్లి పడటం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది.

నల్ల చీమలు సంపదకు సూచిక…

ఇంట్లో కనుక నల్ల చీమలకు బదులు ఎర్రటి చీమలు కనపడితే మనపై అప్పుల భారం పెరుగుతుందని అర్థం. ఇక చాలామంది ఇళ్లల్లో కొన్నిసార్లు అనుకోకుండా పాము కనబడుతూ ఉంటుంది ఇలా పాము కనబడటం వల్ల ఏదైనా దోషం ఉందా అని భావిస్తూ ఉంటారు కానీ పాము కనబడటం లక్ష్మీదేవి రాకకు సూచిక అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంకేతాలు కనుక కనపడితే మీ పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే.

Kailasa parvatham mistery : కైలాస పర్వతంపై శివుడు నిజంగా ఉన్నాడా?? ఎందుకని ఎవరూ ఆ పర్వతం ఎక్కలేకపోతున్నారు…!

Kailasa parvatham mistery : ప్రపంచంలోని ఎత్తయిన పర్వాతాలను చాలా మంది అధిరోహించారు. ఏకంగా ఎవరెస్టును కూడా అధిరోహించారు. కానీ ఎవెరెస్టు కంటే తక్కువ ఎత్తులో ఉండే కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటికీ ఏ ఒక్కరూ ఎందుకు ఎక్కలేకపోయారు. అక్కడ అతీత శక్తులు ఉన్నాయా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. మన భారతీయ సంస్కృతి రామాయణం, మహా భారతంను దాటి పక్కకు పోదు. చిన్నతనం నుండి మనం ఏదో ఒక సందర్బంలో రామాయణ, మహా భారత గాధలనే కథలుగా వింటూనే ఉన్నాం. అలా రామాయణంలో రావణుడి గురించి తెలుసుకున్నాం. రావణుడు శివని అపరభక్తుడు. ఆయన ఆత్మలింగాన్ని పొందడానికి ఆయన పది తలలను శివునికి అర్పించారు. ఈ విషయం మనం కథలలో తెలుసుకున్న ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. అది మరెక్కడో కాదు ఈ కైలాస పర్వతం మీదనే.

కైలాస పర్వతం మీద నిజంగానే శివుడు ఉన్నాడా…

కైలాస పర్వతంకి అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే, కౌలస అనే సంస్కృత పదం నుండి వచ్చింది. కౌలస అనగా స్పటికం అని అర్థం. కైలాస పర్వతం ఇప్పటి టిబెట్ ప్రాంతంలో అనగా నేడు చైనా ఆక్రమిత టిబెట్ లో ఉంది. దాదాపు ఎన్నో కోట్లమంది ప్రజలు ఈ కైలాస పార్వతంను ఆధ్యాత్మిక ప్రాంతంగా భావించి పూజిస్తున్నారు. ఇక ఈ పర్వతం ఎత్తు 6.6 కిలోమీటర్లు. ప్రపంచంలోని ఎన్నో ఎత్తయిన పర్వతాలలో ఇదీ ఒకటి. ఇక ఈ పర్వతాన్ని ఇప్పటివరకు ఎవరూ అధిరోహించలేదు కానీ పర్వతపు మొదలుకు వెళ్లి పూజలు చేస్తారు. అక్కడ ఉన్న రెండు సరస్సులు ఒకటి మానస సరోవర్ మరొకటి రాక్షస్థల్. మానస సరోవరం బ్రహ్మ మనసు నుండి పుట్టింది. ఇక ఇక్కడ మునక వేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయని నమ్మకం. ఇది సూర్యుని వెలుగుకు ప్రతీక కాగా పక్కన ఉన్న రాక్షస్థల్ ఉప్పు నీటి సరస్సు. ఇది చంద్రుని ఆకారంలో ఉంటుంది. ఇందులో రావణాసురుడు తన ఒక్కోతలను ఒక్కోరోజు బలిగా శివునికి అర్పించాడని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ సరస్సులో ఎవరూ మునగరు.

ఇక మానస సరోవరం లో బ్రహ్మ ముహూర్తం సమయంలో అంటే వేకువ జామున కైలాస పర్వతం నుండి శివుడు వచ్చి స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీనికి సాక్ష్యంగా కైలాస పర్వతం నుండి ఆ సమయంలో మానస సరోవరం కు ఒక వెలుగు రావడం చూశామని చాలా మంది భక్తులు చెప్పారు. అయితే ఈ వెలుగు ఎందుకు వస్తోందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఇక ఈ పర్వతం వద్ద వృద్దాప్యం త్వరగా వస్తుంది, రెండు వారాలలో పెరగాల్సిన గోర్లు, వెంట్రుకలు 12 గంటలలోనే పెరుగుతాయి దీనికి కారణం ఇప్పటికీ అంతుచిక్కలేదు. ఇది కూడా ఈ పర్వతాన్ని అధిరోహించక పోవడానికి కారణం. రేడియేషన్ అధికంగా ఉండే ఈ పర్వతం అధిరోహించడానికి ప్రయత్నించిన ఎంతో మంది విఫలం అయ్యారు. చైనా ప్రభుత్వం హెలీకాప్టర్ ద్వారా ఈ పర్వతం ఎక్కాలని ప్రయత్నించినా హెలీకాప్టర్ కూలిపోయింది. రెండు సార్లు పర్వతారోహకులకు ఎక్కడానికి అవకాశం కల్పించినా వారు విఫలమయ్యారు. అక్కడికి చేరుకున్న ఎంతో మంది మార్గం మధ్యలోనే అదృశ్యమయ్యారు. దీంతో ఇక ఇప్పుడు ఈ పర్వతాన్ని ఎక్కడాన్ని నిషేదించారు. ఎంతో మంది మత విశ్వాసాలకు భంగం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Karthika Pournami: పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు ఈ పని చేస్తే చాలు.. ఆ శివకేశవుల అనుగ్రహం మీపైనే!

Karthika Pournami: హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే 12 మాసాలు కూడా ఎంతో విశిష్టమైనవి అని చెప్పాలి. అయితే ఇందులో కార్తీక మాసానికి మరింత విశిష్టత ఉంది. కార్తీకమాసం శివ కేశవలకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. అందుకే ఈ నెలలో శివ కేశవులను పూజించడం వల్ల వారి అనుగ్రహం మనపై ఉండి ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారని పండితులు చెబుతుంటారు.

ఈ పవిత్రమైనటువంటి కార్తీకమాసంలో ప్రతి ఒక్కరూ కూడా దీపారాధనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. ఇలా సూర్యోదయానికి ముందే తలంటు స్నానం చేసి ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. అయితే ఈ కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది.

ఈ రోజు కనుక మనం దీపారాధన చేయటం వల్ల సంవత్సరంలో మనం ఏ రోజు దీపారాధన చేయకపోయినా ఈరోజు చేసిన పుణ్యఫలం కలుగుతుందని చెప్పాలి.ఈ కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున ఆలయాలలోనూ తులసి కోట ముందు కూడా ఇక దీపాలను వెలిగిస్తూ ఆ శివకేశవులను ఆరాధిస్తూ ఉంటారు..ఇలా దీపారాధనకు ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి రోజు మరికొన్ని పనులు చేయటం వల్ల కూడా ఆ శివకేశవుల అనుగ్రహం మన పైనే ఉంటుంది.

దానధర్మాలు చేయాలి..

కార్తీక పౌర్ణమి దీపారాధనకు ఎంత విశిష్టత కలిగి ఉందో దానధర్మాలకు కూడా అంతే విశిష్టత కలిగి ఉంది. అందుకే మనకు తోచిన మేరకు మన ఆర్థిక స్తోమత బట్టి ఇతరులకు దానధర్మాలు చేయడం ఎంతో మంచిది.
పవిత్రమైన కార్తీక మాసం రోజున చేయాల్సిన మరి కొన్ని ముఖ్యమైన పనులు ఏంటి అనే విషయానికి వస్తే.. దైవ దర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ. ఇలా పౌర్ణమి రోజు ఈ పనులను చేయటం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

Rangam Bhavishyavaani : గత ఏడాది హామీలు ఏమయ్యాయి… ఈ ఏడాది వర్షాలు, అగ్నిప్రమాదాలు…!

Rangam Bhavishyavaani : ప్రతి ఏడాది ఆషాడంలో అమ్మవారికి పూజలు జరుగుతాయి. తెలంగాణలో బోనాలను కన్నులపండుగగా జరుపుతారు. ప్రతిసారిలాగేనా ఈ ఏడాది ఘనంగా లష్కర్ బోనాల పండుగ మొదలయింది, రెండో రోజు రంగం కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మహంకాళి అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది పంటల పరిస్థితి, వర్షాలు, రాజకీయాలు ఇలా అన్నింటి గురించి అమ్మవారు తెలిపారు.

వర్షాలు బాగుంటాయి…

రంగం భవిష్యవాణిని పచ్చికుండ పై నిలబడి స్వర్ణలత అమ్మవారు పూనాక భవిష్యత్తు చెప్పారు. గత ఏడాది ఇచ్చిన హామీలను మరచిపోయారంటూ అమ్మవారు పలికారు. ఈ ఏడాదైనా ఆ హామీలను తీర్చాలని చెప్పారు. ఇబ్బందులు ఉన్నా ఈ ఏడాది వర్షాలు పడుతాయని చెప్పారు.

అయితే అగ్నిప్రమాదలు జరుగుతాయని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇక తను చూస్తూనే ఉన్నట్లు ప్రతి గడపను కాపాడుతానని అమ్మవారు అభయం ఇచ్చారు. పూజలు అన్నీ చక్కగా నిష్ఠతో చేసారని, తాను ఎవరు ఏమి చేసారో అన్నీ చూస్తున్నట్లుగా తెలిపారు. వచ్చే ఏడాది లోపు గతంలో ఇచ్చిన హామీలను తీర్చాలని చెప్పారు. ఇక బోనాల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించగా లక్షలాది మంది ఈ ఏడాది బోనాలకు వచ్చారు.

Adhika Shravanam Effects : అధిక శ్రావణ మాసంలో శుభాకార్యాలు చేయవచ్చా… అసలు అధిక మాసం ఎలా ఏర్పడుతుంది…!

Adhika Shravanam Effects : పండితులు జనార్ధన చార్యులు ఆషాడం తరువాత వచ్చే అధిక శ్రావణ మాసం గురించి వివరించారు. అనేక సందేహాలను నివృత్తి చేసారు. మామూలుగా శ్రావణ మాసం వస్తుంది అనగానే లక్ష్మీదేవి ఆరాధన, మరోవైపు పెళ్లిళ్లు వంటి శుభకర్యాలు పండుగలతో కళకళలాడుతుంది. కానీ ఈసారి వస్తున్న శ్రావణ మాసం అధిక మాసం. ఈ నెల 18న అమావాస్య తరువాత ప్రారంభమయ్యే అధిక మాసం వచ్చేనెల 16 వరకు కొన సాగుతుందని జనార్ధన చార్యులు తెలిపారు. అయితే ఈ అధిక శ్రావణ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయొచ్చు వంటి విషయాలను ఆయన తెలిపారు.

పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు చేయరాదు…

మన కాలమానంను సంవత్సరాలు, నెలలు, ఋతువులు, తిధులు, పక్షాలు అంటూ లెక్కిస్తాము. అయితే రెండు రకాల గణనాలు ఇక్కడ ఉంటాయి. ఒకటి సౌర మానం, మరొకటి చాంద్ర మానం. సౌరమాన సంవత్సరానికి చాంద్రమాన సంవత్సరానికి పదకొండుంబావు రోజులు తేడా ఉంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. ఇదే మాదిరిగా చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇందువల్ల ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావడం జరగకుండా పోతుంది. చాంద్రమానంలో సూర్య గమనం లేని మాసాన్ని ‘అధికమాసం’ అంటాం. అంటే, సూర్యుడు ఆ నెలలో ఏ రాశిలోనూ కొత్తగా ప్రవేశించడు.

ఇలా రెండు సార్లు చంద్రుడు తిరిగినా ఆర్యుడి గమనంలో మార్పు రాకపోతే అది అధికమాసం అవుతుంది అంటూ తెలిపారు. అధికంగా వచ్చే అధికమాసంలో శుభకార్యాలకు, ముఖ్యమైన దైవకార్యాలకు పనికిరాదని మన పెద్దలు నిషేధించారు. సూర్యుడి గమనం లేని మాసంలో శుభకర్యాలు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనం వంటివి చేయరాదని చెప్పారు. లక్ష్మి నారాయణుడి కి పూజలు చేస్తే మంచిదని ఈ అధికమాసం లో విష్ణువుకి పూజ చేస్తే మనం ఏది కోరుకుంటామో అది అధికంగానే లభిస్తుందని తెలిపారు.

Analyst Damu Balaji : పుట్టపర్తి సత్య సాయి ఆశ్రమంలో బుల్లెట్ గాయలతో ఆరు శవాలు… కాల్చింది ఎవరంటే…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : అనంతపురం జిల్లా పుట్టపర్తి అనగానే సత్య సాయి బాబా గుర్తొస్తాడు. కొన్ని లక్షల విదేశీ, స్వదేశీ భక్తులు ఆయనకు ఉన్నారు. ఇండియా లోనే కాకుండా ఇతర దేశాల నుండి ఆయన కోసం ఇప్పటికీ భక్తులు వస్తూ ఆయన ఆశ్రమం దర్శిస్తుంటారు. ఇక పుట్టపర్తిలో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్, విద్యా వైద్య సపదుపయాలను అందరికీ అందిస్తూ బాబా లేకపోయినా ఇప్పటికీ ఆ సేవలను ప్రజలకు అందిస్తున్నారు. ఇక సత్య సాయి బాబా 1926లో జన్మించగా చిన్నతనంలో తేలు కుట్టి మూడు రోజులు లేవలేక పోయాడట. ఆ తరువాత ఆయనలో మార్పులు కనిపించాయని సంస్కృత శ్లోకాలు పలకడం మొదలు పెట్టి వింత ప్రవర్తన చూపించడం, ఆ తరువాత తాను షిరిడి సాయి అవతారం అని చెప్పడం జరిగిందని అనలిస్ట్ బాలాజీ తెలిపారు.

ఆశ్రమంలో ఆరుగురి మీద కాల్పులు…

1918లో బాబా మరణించాక 1926లో పుట్టపర్తి బాబా జన్మించడం, తనని తాను షిరిడి సాయి గా చెప్పడంతో జనాలు ఆయన దర్శనం కోసం క్యూ కట్టారు. ఇక మొదట ఒక తోటలో కూర్చొని జనాలతో కలిసి భజనలు చేస్తూ ఉండే ఆయన జనాల్లో ప్రాచుర్యం పొందాక ఒక్కొక్కటిగా పుట్టపర్తిలో డెవలప్ అయ్యాయి. అటు విదేశీ భక్తులు క్కూడా ఎక్కువయ్యారు అంటూ బాలాజీ తెలిపారు. 1967 ఆ ప్రాంతంలో బాబా కి భక్తులు ఎక్కువయ్యారు. ఆలాగే ఆయనకు రాజకీయ నాయకుల సందర్శనం కూడా ఎక్కువైంది అంటూ బాలాజీ తెలిపారు. ఆయన ఆశ్రమాలను విదేశాల్లో కూడా స్థాపించారు అంటూ చెప్పారు. అయితే బాబా జీవితంలో మాసిపోని మచ్చ 1993 జరిగిన కాల్పులు.

ఆశ్రమంలో ఆరుమంది మీద కాల్పులు జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది అంటూ చెప్పారు. అయితే బాబా ను కత్తితో పొడవడానికి కొందరు ప్రయత్నించగా అడ్డుకున్న వారిని కాల్చారు అంటూ అప్పట్లో ఆశ్రమంలో చెప్పిన కథనాలు జోరు గా వినిపించాయి. ఆశ్రమంలో ఏదో జరుగుతోంది అనే వార్తలు బయటికి వ్యాపించడం బాబా కీర్తి మసకబారడంతో విరాళాలు సేకరించిన డబ్బుతో ఆ చుట్టూ పక్కల ప్రాంతాల్లో తాగు నీరు సౌకర్యం కల్పించారు. అలాగే వైద్య, విద్యా సౌకర్యాలను కల్పించారు అంటూ బాలాజీ తెలిపారు. ఇక ఆశ్రమంలో కాల్పులు ఎవరు ఎందుకు చేసారో ఇప్పటికీ తెలియదని తెలిపారు.

Tirumala Darshanam : సీనియర్ సిటిజన్స్ కు శుభవార్త చెప్పిన టీటీడీ… తిరుమల దర్శనం ఇక సులువు…!

Tirumala Darshanam : ఇండియాలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అవి దర్శించుకుంటాం వస్తాం కానీ ఒక్క తిరుమల మాత్రం ఎన్ని సార్లు చూసినా ఆ దేవదేవుడిని తనివి తీరదు. ప్రతిసారి వెళ్లి ఆ అలంకారం ప్రియుడిని దర్శించుకోవాలని భావిస్తుంటారు. అయితే అక్కడ రద్ది కారణంగా ఎంతో కొంత ఇబ్బందైతే తప్పదు. యువకులతే ఎలాగోలా తిరుమల వెళ్లి దర్శనం సజావుగా చేసుకుని వస్తారు. మరీ చినపిల్లలున్న మహిళలకు కూడా వసతులు కల్పిస్తోంది టీటీడీ అయితే తాజాగా సీనియర్ సిటిజన్స్ కి ఊరట కలిగించింది.

60 ఏళ్ల పై బడిన వారికి 30 నిమిషాల్లో దర్శనం….

తాజాగా టీటీడీ 60 ఏళ్ళు పైబడిన వృద్దులకు దర్శనము ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ముందుగా ఆధార్ కార్డు ద్వారా 60 ఏళ్ల వయసున్న వారు రిజిస్టర్ చేసుకుంటే వారికి దర్శనం సెపరేట్ క్యూ లైన్ ద్వారా కేవలం అరగంట నుండి గంట లోపు అయిపోయేలాగా చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం మిగికిన క్యూ లైన్లను కొంచం సేపు నిలిపి సీనియర్ సిటిజన్స్ కి దర్శనం చేయిస్తారు.

ఇక మరిన్ని వివరాలు తెలుసు కోవాలంటే టీటీడీ సలహా నెంబర్ 08772277777 హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి సందేహాలు నివృతి చేసుకోవచ్చు. ఇక దర్శనం అనంతరం కూడా ప్రసాదం లడ్డు తీసుకోడానికి కూడా ఎలక్ట్రిక్ వాహనాల సహాయంతో చేరుకునేలా వృద్ధులకు వసతులు కలిపిస్తోంది టీటీడీ.

Balagam Actor: చిరిగిన బట్టలు వేసుకుని తిరిగే వాడిని… రిటైర్ అయినా చేతిలో రూపాయి లేదు: బలగం నటుడు

Balagam Actor: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం బలగం. ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటినటులకు కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.ఇక ఈ సినిమాలో కేవలం నల్లి బొక్క కోసం అత్తవారింటితో గొడవ పడి అల్లుడి పాత్రలో నటించారు నటుడు మురళీధర్ గౌడ్.

ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మురళీధర్ గౌడ్ తన కన్నీటి కష్టాల గురించి తెలియజేశారు. తన తల్లిదండ్రులకు ఐదుగురు సంతానమని నలుగురు అన్నదమ్ములు, ఒక కుమార్తె సంతానమని తెలిపారు నాన్న కుటుంబ పోషణ కోసం చాలా దూరం వెళ్లి పనులు చేసుకొనీ వచ్చేవారు.

ఇలా నాన్న సంపాదనతో కుటుంబ పోషణ చాలా భారంగా మారిందని ఏదైనా అవసరమైతే కనీసం చేతిలో పది రూపాయలు కూడా లేని దుర్భర పరిస్థితులలో తాము బ్రతికామని తెలిపారు. ఇక చిన్నప్పుడు వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండేది కాదని, చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగే వాడిని అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.ఇలా చిరిగిన చొక్కా వేసుకుని తిరుగుతూ ఉంటే తన స్నేహితుడు తనని ఎగతాళి చేసే వారని ఇప్పటికీ ఆ కష్టాలు అవమానాలు కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయని తెలిపారు.

Balagam Actor:

ఇక తాను చదివి ఎలక్ట్రిసిటీ బోర్డులో 27 సంవత్సరాల పాటు పని చేశానని తెలిపారు. ఇలా తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ తన కష్టాలు మాత్రం తీరలేదని తెలియజేశారు.27 సంవత్సరాల తర్వాత రిటైర్ అయితే కనీసం చేతిలో రూపాయి లేదని తన బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అని ఈ సందర్భంగా ఈయన తన కష్టాల గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.