Comedian Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసినా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా ‘బ్రో’ సినిమాలో ఆయన పాత్రకు మంచి క్రేజ్ వచ్చింది.
శ్యామ్ బాబు తో శోభన్ బాబు సినిమాలో ఛాన్స్…
రీసెంట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సినిమా బ్రో. ఈ సినిమా అంతా ఒకెత్తయితే సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ మరో ఎత్తు. కేవలం సినిమాలో 1 నిమిషం 5 సెకెండ్లు నిడివితో శ్యామ్ బాబు పాత్ర ఉన్నా ఆ క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది. మీడియా అటెన్షన్ అంతా కూడా ఆ పాత్ర మీదే పడింది. దీంతో ఇపుడు అదే క్యారెక్టర్ ను ఫుల్ లెన్త్ లో వాడుకోవాలని శోభన్ బాబు సినిమా యూనిట్ అనుకుంటున్నారట.
అందుకే రాబోయే శోభన్ బాబు అనే సినిమాలో శ్యామ్ బాబు క్యారెక్టర్ దాదాపు రెండు గంటలపాటు సాగనుందట. ఈ విషయం పృథ్వీ తన పుట్టినరోజు సందర్భంగా ఒక సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. తన కెరీర్ ను మలుపు తిప్పే పాత్రను శోభన్ బాబు సినిమాలో చేయనున్నట్లు పృథ్వీ తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…