Dil Raju: హీరో నితిన్ తో ఎంసీఏ సీక్వెల్ ఆలోచనలో దిల్ రాజు.. ఇదేం విడ్డూరం అంటూ ఫైర్ అవుతున్న నాని ఫాన్స్!

Dil Raju: వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో నాని సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ఎంసీఏ.ఇక ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ నాని కెరియర్ లో అప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ మధ్యకాలంలో సీక్వెల్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే నాని నటించిన ఎంసీఏ సినిమాకు సీక్వెల్ చిత్రం చేయాలన్న ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో నాని హీరోగా కాకుండా నితిన్ తో చేయాలన్న ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే నాని అభిమానులు ఎంసీఏ సీక్వెల్ చేయాలంటే నానితో చేయాలి కానీ నితిన్ తో చేయడం ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసిన వేణు శ్రీరామ్ ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నాని ప్రస్తుతం మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యి బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు నితిన్ ను తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారట అయితే నితిన్ కూడా ప్రస్తుతం వక్కంతం వంశీ, వెంకీ కుడుముల డైరెక్షన్లో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు.

Dil Raju: దసరా ప్రమోషన్లలో నాని…

మరి దిల్ రాజు నానిని కాకుండా నితిన్ ను ఈ సినిమా సీక్వెల్ కోసం తీసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారక ప్రకటన వెలవడనుంది. ఇక ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించిన దసరా సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.