Director Geetha Krishna : ఫిబ్రవరి 2 న అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతు దిగ్గజ డైరెక్టర్ కళా తపస్వి కే విశ్వనాథ్ గారు 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన తెలుగులో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను తీసి ప్రేక్షకులను అలరించారు. ఆయన తీసిన మొదటి సినిమా నుండే అవార్డులు సత్కారాలు ఆయనకు క్యూ కట్టాయి. ఇక ఆయన తీసిన ఎన్నో చిత్రాల్లో భారతీయ సంస్కృతి అలాగే కళలను ముందు తరాల వారికి అందించారు. ప్రతి సినిమాలోనూ ఆయన చెప్పాలనుకున్న కథతో మిళితంగా సమాజానికి ఏదో ఒక సందేశం ఉంటుంది. ఇక ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆయన శిష్యుడు డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఆయనను తలుచుకుంటూ ఆయన సినిమా జీవిత విశేషాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
నాగేశ్వరావు గారికి, విశ్వనాథ్ గారికి గొడవ…
విశ్వనాథ్ గారు మొదట సౌండ్ రికార్డర్ గా పని మొదలు పెట్టి ఆపైన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆదుర్తి సుబ్బరావు గారి వద్ద పనిచేసారు. అయితే నాగేశ్వరావు గారి సినిమాకు సౌండ్ రికార్డర్ గా పనిచేస్తున్న సమయంలోనే ఆయన డైలాగు చెప్పిన విధానంలో తప్పు ఉందని నాగేశ్వరావు గారికి చెప్పడంతో ఆయన దృష్టిలో పడ్డారు. అలా అయన సునిశిత పరిశీలన నచ్చి నాగేశ్వరావు గారు ఆదుర్తి గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయమని చెప్పారంటూ గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు.
ఇక విశ్వనాథ్ గారి మొదటి సినిమా ఆత్మ గౌరవం కూడా నాగేశ్వరావు గారితో చేసారు. మూగమనసులు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినపుడే నాగేశ్వరావు గారు విశ్వనాథ్ గారికి సినిమా ఆఫర్ ఇచ్చారట. అలా మొదటి డైరెక్షన్ నాగేశ్వరావు గారితో చేసిన ఆ తరువాత ఆయనతో కొనసాగాలేదు వరుసగా ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ వంటి హీరోలతో ఆయన సినిమాలను తీశారు. నాగేశ్వరావు గారికి, విశ్వనాథ్ గారికి మధ్య చిన్న మనస్పర్తలు కారణంగా వారిద్దరూ ఆత్మ గౌరవం సినిమా తరువాత కలిసి పనిచేయలేదు. మళ్ళీ అన్ని మర్చిపోయి ‘సూత్రాధారులు’ సినిమాకు పనిచేసారంటూ డైరెక్టర్ గీతా కృష్ణ ఆయన గురువుగారైన విశ్వనాథ్ గురించి తెలిపారు.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…