Director Nandhini Reddy : హైదరాబాద్ కు చెందిన నందిని రెడ్డి దర్శకురాలిగా మంచి సినిమాలను తీస్తూ మంచి ఇమేజ్ ను తనకంటూ సంపాదించుకున్నారు. ఒక మహిలా డైరెక్టర్ గా మంచి హిట్ సినిమాలను అందించిన నందిని తాజాగా సంతోష్ శోభన్ హీరోగా ‘అన్నీ మంచి శకునములే’ అనే సినిమాను తీసారు. ఆ సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నందిని రెడ్డి తన వ్యక్తిగత జీవితం, పెళ్లి వంటి విషయాల గురించి చెప్పారు.
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం…
నందిని రెడ్డి ‘అలా మొదలయింది’ సినిమాతో తన సినిమా కెరీర్ మొదలు పెట్టి మంచి హిట్ అందుకుంది. ఆపైన కళ్యాణ వైభోగం, ఓహ్ బేబీ వంటి సినిమాలతో హిట్స్ అందుకున్నా జబర్దస్త్ వంటి డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక దాదాపు మూడు నెలలు ఖాళీగా ఉన్న నందినిని బన్నీ పిలిచి ఏం చేస్తున్నావ్, నెక్స్ట్ ప్రొజెక్ట్ ఏమిటి అని అడిగి బాగా తిట్టారట. ఒక సినిమా పోయిందని అలాగే ఉండిపోతావా నెక్స్ట్ ఆలోచించవా అంటూ క్లాస్ పీకారట.
ఇక తనకు ప్రభాస్ అంటే క్రష్ అని చెప్తూ తన అంత అందగాడు మరెవరూ లేరంటూ చెప్పారు. ఇక పెళ్లి విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ పెళ్లి తరువాత తాను పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పారు ఇక అలా కాదనుకుంటే ప్రభాస్ పెళ్లి తరువాత తాను పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పారు. ఇక తన వస్త్రధారణ గురించి మాట్లాడుతూ కంఫర్ట్ గా ఉండే బట్టలే ప్రిఫర్ చేస్తా అంటూ మాట్లాడారు. ఇక తిరుపతిలో రీసెంట్ గా జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుతూ ప్రెస్ మీట్ కి ఫ్లైట్ ఆలస్యంగా ల్యాండ్ అవడం వల్ల ఆలస్యంగా వెళ్ళాం. అందుకు వాళ్ళు మీరెవరో తెలియదు పరిచయం చేసుకొండి అంటూ మాట్లాడరు. అప్పటికి నేను పరిచయం చేసుకుని సినిమా గురించి ఆర్టిస్టుల గురించి మాట్లాడి తరువాత హీరో సంతోష్ కి ఇవ్వగా తనని కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవాలని చెప్పారు. అదే ఇష్యూ వేరే ఏమి లేదు అంటూ తెలిపారు నందిని రెడ్డి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…