బాలయ్య కోసం యాక్షన్ కథను రెడీ చేసిన డైరెక్టర్..?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అఖండ” సినిమాలో నటిస్తున్నారు. మొట్టమొదటిసారిగా బాలకృష్ణ అఖండ సినిమాలో త్వీపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ అఖండ సినిమా తరువాత దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

గోపీచంద్ మలినేని దర్శకత్వం తర్వాత బాలయ్య కోసం అనిల్ రావిపూడి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మరొక దర్శకుడు వెంకీ అట్లూరి సైతం బాలయ్య కోసం ఒక కథను సిద్ధం చేసి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రేమ కథలనే తెరకెక్కించిన దర్శకుడు అట్లూరి వెంకీ మొట్టమొదటిసారిగా బాలయ్య బాబుతో యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇందుకోసమే ఓ కథను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కే ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో బోయపాటి సినిమా తర్వాత బాలయ్య ఎవరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచిచూడాలి. అయితే ఈ నెల 10వ తేదీన బాలయ్యబాబు పుట్టినరోజు కావడంతో ఆరోజు ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారాన్ని దర్శకుడు తెలియజేయనునట్లు తెలుస్తోంది.

బోయపాటి అఖండ సినిమా విషయానికొస్తే ఇదివరకు వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన లెజెండ్, సింహ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి. ఈ క్రమంలోనే ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది.కరోనా ప్రభావం వల్ల షూటింగ్ వాయిదా వేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్రబృందం తెలియజేశారు.