Director Relangi Narasimharao : తెలుగులో హాస్య ప్రధాన సినిమాలు తీసే డైరెక్టర్లలో రేలంగి నరసింహారావు గారు ఒకరు. పాలకొల్లు కి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఇక ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు. ఇక డైరెక్టర్ గా ఒక కథ హిట్ అవుతుందా లేక పోతుందా అనే విషయం కథ చర్చల్లో అలాగే స్క్రిప్ట్ వర్క్ జరిగే సమయంలోనే తెలిసిపోతుందంటూ ఆయన తన అనుభవాలను పంచుకున్నారు.
కథ చెప్తుంటే సురేష్ బాబు మధ్యలోనే వెళ్లిపోయారు….
ఉషా కిరణ్ బ్యానర్ లో వెంట వెంటనే హిట్స్ కొట్టిన రేలంగి నరసింహారావు గారి సురేష్ ప్రొడక్షన్స్ నుండి పిలుపు వచ్చిందట. రామానాయుడు గారు పిలిచి కథ రెడీ చేసుకో సినిమా చేదాం అని చెప్పగానే రేలంగి గారు కాశి విశ్వనాధ్ అనే మరో రైటర్ ను కలిసి కథ రెడీ చేసుకున్నారట. ఇక కథ వినిపించడానికి రైటర్ తో కలిసి రామానాయుడు గారి ఇంటికి వెళ్లగా సురేష్ బాబు కూడా కథ వినడానికి వచ్చారట. కథ రామానాయుడు గారు ఓపిగ్గా వింటున్న సురేష్ బాబు మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ కదులుతునే ఉన్నారట.
ఇక కథ ఇంకా పూర్తి అవ్వకనే మధ్యలో వెళ్లిపోయారట. ఇక కథ విన్నాక రామా నాయుడుగారు నరసింహరావు కథ ఇదే కదా అంత టుకీగా చెప్పారట. అదేనండి అనగానే కథ బాగోలేదు నరసింహ రావు అని ఆయన చెప్పక ముందే రేలంగి గారికి సురేష్ బాబు మధ్యలో లేచి వెళ్లిపోవడంతోనే అర్థమైందంట కథ వారికి నచ్చలేదని. ఇక ఆ కథని పక్కన పెట్టేశారట. మళ్ళీ కొద్ది కాలానికి ఆ కథ గురించి ఆలోచిస్తే అసలు ఇలాంటి కథ నేనెల చేద్దామనుకున్నాను అనిపించింది అంటూ రేలంగి నరసింహారావు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…