Disco Shanti : డిస్కో శాంతి….1990 లలో ఈ పేరు వినని సినీ ప్రేక్షకులు వుండరు. మొదట తమిళ్ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన డిస్కో శాంతి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ తో పాటు ఒడియా లో కూడా నటించింది. ఈమె సినీ ప్రస్థానంలో మొత్తం 900 కు పైగా సినిమాలలో నటించింది. ఐటమ్ పాటలు మాత్రమే కాకుండా అతిథి పాత్రలో, కామెడీ పాత్రలో కూడా అభిమానులను మెప్పించింది. వెంకటేష్ తప్పితే మిగతా అందరి హీరోల సరసనా నటించింది. 1996 లో శ్రీహరిని వివాహం చేసికున్నారు. పెళ్లి తరువాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. కాగా కుమార్తె నాలుగు నెలల వయసులో చనిపోవడంతో పాప పేరు మీద అక్షర ఫౌండేషన్ ని నడుపుతున్నారు.
చెప్పుతో కొట్టె సీన్ ఉండటంతో ఆ సినిమా వద్దనుకున్నా…….
అక్షర ఫౌండేషన్ లో భాగంగా మేడ్చల్ లోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే శ్రీహరి మరణానంతరం డిస్కో శాంతి చాలా క్రుంగిపోయారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. శ్రీహరి మరణం తరువాత కోలుకోవడానికి సమయం పట్టిందని. ఆయన చనిపోయి 9 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి పూర్తిగా కోలుకోలేదని చెప్పారు. ఆయన మరణం తరువాత తాగుడుకు ఎక్కువగా బానిస అయ్యానని కానీ ఇప్పుడు పిల్లల కోసం పూర్తిగా మనుకున్నాను అని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ తో అనుబంధం గురించి చెబుతూ…. మా కుటుంబంతో చాలా బాగా ఉంటారని, ఆయనను బాబాయ్ అని పిలిచేవారని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రస్థావించగా సినిమా చాలాబాగుంది చరణ్ కన్నా ఎన్టీఆర్ బాగా చేసాడు అని చెప్పింది. ఇక కృష్ణ గారి ఫ్యామిలీతో సినిమాల గురించి ప్రస్థావించగా…. మహేష్ బాబుతో ఒక అవకాశం వచ్చిన్నింది, కానీ చెప్పుతో కొట్టె సన్నివేశం ఉందన్నారు నేను చేయను, నన్ను ఎవరైనా అలా కొడితే తిరిగి నేను కూడా కొడతాను, ఎంత పెద్ద హీరో అయినా నేను మాత్రం అలా చేయను అని ఆ సినిమా వదులుకున్నాను అని చెప్పుకొచ్చారు.
వేసవి వచ్చిందంటే పిల్లలకు సెలవులు, ఆటలు, సరదాలు మొదలవుతాయి. ఈ సమయంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను స్విమ్మింగ్ క్లాసులకు…
వేసవి కాలం వచ్చిందంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో…
హిందువుల అత్యంత పవిత్ర తీర్థయాత్రల్లో ఒకటిగా భావించే కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. 2026…
ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని సింగరకొండ పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ప్రకృతి అందాలను కలగలిపిన ఈ…
ఇటీవల కాలంలో జుట్టు రాలడం, పలచబడడం, పెరుగుదల మందగించడం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. కాలుష్యం, ఒత్తిడి,…
బరువు తగ్గాలనుకునే చాలా మంది ముందుగా చేసే మార్పు అన్నం మానేయడమే. “రైస్ తింటే వెంటనే బరువు పెరుగుతాం” అనే…