Revantha Reddy: రేవంత్ రెడ్డి అనుముల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఓ ప్రభంజనం సృష్టించారు. పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినటువంటి ఈయన కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణలో హస్తం జెండాను ఎగురవేశారు. ఇలా ముఖ్యమంత్రి పదవికి మరికొన్ని గంటలలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కూడా చేయబోతున్నారు.
ఇలా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నటువంటి రేవంత్ రెడ్డి విజయం వెనుక తన భార్య గీతారెడ్డి కూడా ఉన్నారు. ఇలా ఈయన చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థి సంఘానికి లీడర్ గా కొనసాగారు ఇలా మొదలైనటువంటి ఈయన ప్రస్థానం నేడు ముఖ్యమంత్రి పదవి అధిష్టించే వరకు చేరుకుంది. ఇక ఈయన రాజకీయ ప్రస్థానం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే రేవంత్ రెడ్డిది ప్రేమ వివాహమని చెప్పాలి.
నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డి గ్రామంలో జన్మించినటువంటి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఇలా చదువుతున్న సమయంలోనే ఈయన విద్యార్థి సంఘానికి లీడర్ గా ఉన్నారు. అదే సమయంలోనే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడు కుమార్తె గీతారెడ్డి ప్రేమలో పడ్డారు. ఇక వీర ప్రేమ విషయం గీతారెడ్డి తండ్రికి తెలియడంతో ఆమెను ఢిల్లీలో ఉన్నటువంటి తన సోదరుడు జైపాల్ రెడ్డి వద్దకు పంపించారు. అక్కడికి వెళ్లిన వీర ప్రేమ ప్రయాణం మాత్రం ఆగలేదు. జైపాల్ రెడ్డినే రాయబారిగా మార్చి తమ ప్రేమను గెలిపించుకున్నారు.
రేవంత్ విజయం వెనుక భార్య గీతా రెడ్డి…
రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి పట్టుదల మొండితనం చూసినటువంటి జైపాల్ రెడ్డి తన సోదరుడికి నచ్చ చెప్పారట ఎంతో కసి మొండిదల ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎప్పటికైనా ఉన్నత స్థాయిలో ఉంటారని తన సోదరుడికి నచ్చచెప్పి ఈ పెళ్లికి ఒప్పించారు. ఇక వీరిద్దరిది కూడా ఒకే సామాజిక వర్గం కావడంతో పెళ్లికి ఒప్పుకున్నారు. తర్వాత ఈయన జెడ్పిటిసి మెంబర్ గాను ఎమ్మెల్యే గాను, ఎంపీగాను రాజకీయపరంగా అంచలంచలుగా ఎదుగుతూ నేడు ముఖ్యమంత్రిగా గెలుపొందారు. ఇక ఈయన ప్రజాస్వామ్యం అంటూ బయటకు రాగా తన భార్య మాత్రం తన పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ తన భర్త విజయానికి కారణం అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…