Samantha-Nagachaitanya: విడాకుల తర్వాత..మొదటి సారిగా కలిసిన సమంత, చైతూ ఎందుకో తెలుసా?

Samantha-Nagachaitanya: నాగ చైతన్య- సమంత టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా ఉండే వారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఏమైందో ఏమో కానీ ఇటీవల వీరిద్దరు విడాకులతో విడిపోయారు. అయితే అసలు విడాకులకు కారణాలేమిటో ఇప్పటికీ తెలియలేదు.

Samantha-Nagachaitanya: విడాకుల తర్వాత..మొదటి సారిగా కలిసిన సమంత, చైతూ ఎందుకో తెలుసా?
Samantha-Nagachaitanya: విడాకుల తర్వాత..మొదటి సారిగా కలిసిన సమంత, చైతూ ఎందుకో తెలుసా?

అయితే ఫ్యాన్స్ మాత్రం తమకు నచ్చినట్లుగా ఊహాగానాలను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. ముఖ్యంగా సమంతపై చై ఫ్యాన్స్ రెచ్చిపోయారు. విడాకులకు సమంతే కారణం అన్న రీతిలో ట్రోలింగ్ చేశారు. ఈవ్యవహరం పై గతంలో సమంత కూడా చాలా బాధపడింది.

Samantha-Nagachaitanya: విడాకుల తర్వాత..మొదటి సారిగా కలిసిన సమంత, చైతూ ఎందుకో తెలుసా?

కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువునష్టం దావా కూడా వేసింది.  ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య, సమంత సినిమాల్లో బిజీ అయిపోయారు. చైతన్య బంగార్రాజు షూటింగ్ లో బిజీగా ఉండగా… సమంత శాకుంతలం అనే ప్యాన్ ఇండియా మూవీ చేస్తోంది. అయితే వీరిద్దరు విడిపోయిన తర్వాత కలిసింది లేదు. పెద్దగా ఒకరినొకరు ప్రస్తావించుకుంది లేదు.

కలిసే చాన్స్ ఉన్నా.. కలవలేదు..

అయితే ఇటీవల ఓ చోట కలిసే పరిస్థితి ఏర్పడింది. బంగార్రాజు ఆఖరి షెడ్యూల్ షూటింగ్ రామానాయుడు స్టూడియోలో నడుస్తోంది. మరోవైపు అదే స్టూడియోలో సమంత శాకుంతలం సినిమా ప్రారంభమైంది. అయితే సెట్ లో వీరిద్దరు పరస్పరం ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే ఒకరికొకరు ఎదురుపడకుండా ముందుగానే నాగ చైతన్య- సమంతలు వారివారి అసిస్టెంట్లకు ముందుగానే సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఉండకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.