తెలుగు యాక్టర్ సునీల్ వర్మ.. పాపే నా ప్రాణం సినిమాలో వెయిటర్ గా ఒక చిన్న పాత్రలో టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. తర్వాత చేసిన ప్రతీ సినిమాలో కమెడియన్ గా దూసుకుపోయాడు.తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా తనదైన శైలిలో మెప్పించాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న సినిమాలో హీరోగా చేశాడు.
తర్వాత అతడు కామెడీకి ఫుల్ స్టాప్ పెట్టేసి.. హీరోగానే సినిమాలు చేస్తూ.. వచ్చాడు. ఈ రెండు సినిమాల తర్వాత అతడికి ఏ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ఇక తర్వాత మళ్లీ కామెడీ వైపు మళ్లాడు. అయినా సక్సెస్ కాలేదు. చివరకు విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా అతడు విలన్ గా నటించిన సినిమా పుష్ప.
పుష్పలో అతడు మంగళం శ్రీనుగా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సునీల్ చేయగలడనే నమ్మకాన్ని తీసుకొచ్చాడు. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా అతడు సూపర్ స్టార్ మహేష్ బాబుపై తనకున్న అభిప్రాయాన్ని పంచుకోగా.. ఈ క్లిప్ ను అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పోల్చడానికి ‘గొడ్డు’తో పోల్చినా.. అది మహేష్ పడే కష్టానికి ప్రతీకగా నిలవడంతో.. సునీల్ పోలిక సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.
ప్రిన్స్ మహేష్ బాబు చూడటానికి జేమ్స్ బాండ్ లా ఉన్నా.. విపరీతమైన(గొడ్డు) కష్టం పడతాడని.. ఇక ఫైట్లలో అయితే.. నాలుగు ఫ్లోర్స్ లో రోప్ లు వేలాడదీస్తారు.. ఇక ఆ తర్వాత గొడ్డు కష్టం పడతాడని.. అది అయ్యే దాక వదిలిపెట్డడని.. మహేష్ పడే కష్టం గురించి చెప్పాడు. అతడిలో తనకు నచ్చే గుణం అదే అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి అప్ డేట్స్ లేక విలవిల్లాడుతున్న మహేష్ ఫ్యాన్స్ కు సునీల్ వ్యాఖ్యలు కాస్త ఉత్సాహాన్ని ఇచ్చాయనే చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…