Jambalakadipamba: ఈదర వీర వెంకట సత్యనారాయణ (ఈవీవీ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.bసినిమా పై మక్కువతో కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన ఈవీవీ ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో ఈయన జంబలకిడిపంబ రాసి ఆ కథను ఆంధ్రజ్యోతి సపరివార పత్రికకు పంపించారు. ఈ కథ చూసిన పత్రికా సమస్త వారు ఇది కూడా ఒక కథేనా అంటూ ఆ కథని వెనక్కి పంపించారు.
ఇలా ఈ కథతో ఈవీవీ అద్భుతమైన సినిమాలు తీయాలని దర్శకుడిగా తనకు ఒక మంచి గుర్తింపు వచ్చిన తర్వాత ఈ సినిమా చేయాలని భావించారు. అయితే ఈ కథ రాసేటప్పుడు ఇందులో హీరోగా రాజేంద్ర ప్రసాద్ ను అనుకుని రాశారు. ఇక డైరెక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత ఈ సినిమా చేయటానికి సన్నాహాలు చేశారు. అయితే ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ బిజీగా ఉండటం వల్ల నరేష్ ను హీరోగా తీసుకున్నారు.
ఇక హీరోయిన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవరూ కుదరకపోవడంతో ఆమనిని ఎంపిక చేశారు. డివివి దానయ్య, ఆచంట గోపినాథ్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమాను 1992 జులై 12వ తేదీ ఈ సినిమాని విడుదల చేశారు.
ఇలా 50 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెండు కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అప్పట్లో ఓ సెన్సేషన్ గా మిగిలిపోయింది. ఆడవారు మగవారిగా మగవారు ఆడవారుగా నటించడంతో ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో హీరోయిన్ ఆమనికి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా హీరో రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…