Gayatri Guptha : ఐస్ క్రీం 2 సినిమాకు ఒక్క రూపాయి కూడా ఆర్జివి ఇవ్వలేదు…: నటి గాయత్రి గుప్తా

Gayatri Guptha : ఐస్ క్రీం 2, ఫిదా, బంధుక్ వంటి సినిమాలలో నటించి తాజాగా దయ వెబ్ సిరీస్ లో స్వేచ్చ అనే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న గాయత్రి గుప్తా అంతకు ముందు బిగ్ బాస్ తెలుగు మీద కేసులు వేసి ఫేమస్ అయింది. ఒపన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే గాయత్రి తెలంగాణ సంగారెడ్డి జిల్లా, జోగిపేట్ లో జన్మించింది. ఇంట్లో నుండి బయటికి వచ్చి మొదట సాక్షి న్యూస్ ఛానెల్ లో పనిచేసిన గాయత్రీ ఆపైన సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లిన సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ఒపనే గా చెప్పి సెన్సేషన్ అయింది.

ఆర్జివి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు…

గాయత్రి గుప్తా మొదట బంధుక్ సినిమాలో నటించిన మొదట విడుదల అయినా సినిమా మాత్రం రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీం 2. ఆ సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. ఇదే విషయం ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసినపుడు అడిగాను అంటూ చెప్పారు గాయత్రి. అయితే ఐస్ క్రీం సినిమా ఆడిషన్ వెళ్ళినపుడే అక్కడ వాళ్ళు చెప్పారు.

రెమ్యూనరేషన్ ఇస్తామనే నమ్మకం పెట్టుకోవద్దు సినిమా విడుదల అయితే కానీ చెప్పలేమని మొదటే చెప్పారు. అయితే రామ్ గోపాల్ వర్మ వంటి డైరెక్టర్ తో పనిచేసే అవకాశం కంటే ఇంకేం కావాలి అని రెమ్యూనరేషన్ లేకుండానే చేసానంటూ చెప్పారు గాయత్రి. అయితే చాలా సినిమాలకు తనకు ఇప్ప్పటికి రెమ్యూనరేషన్ ఇస్తామని అడ్వాన్స్ ఇచ్చి చేతులు దులుపుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఇప్పటికి నాకు 14 లక్షలు రావాలి కానీ అవి ఇక రావని వదిలేసాను అంటూ చెప్పారు.