Gayatri Guptha : ఐస్ క్రీం 2, ఫిదా, బంధుక్ వంటి సినిమాలలో నటించి తాజాగా దయ వెబ్ సిరీస్ లో స్వేచ్చ అనే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న గాయత్రి గుప్తా అంతకు ముందు బిగ్ బాస్ తెలుగు మీద కేసులు వేసి ఫేమస్ అయింది. ఒపన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే గాయత్రి తెలంగాణ సంగారెడ్డి జిల్లా, జోగిపేట్ లో జన్మించింది. ఇంట్లో నుండి బయటికి వచ్చేసి మొదట సాక్షి న్యూస్ ఛానెల్ లో పనిచేసిన గాయత్రీ ఆపైన సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లిన సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ఒపనే గా చెప్పి సెన్సేషన్ అయింది.
అందరి బాగోతాలు చెప్తాను.. భయపడను….
గాయత్రీ ‘దయ’ హిట్ తో మరోసారి ఇంటర్వ్యూ లలో బిజీగా ఉంది. తాజాగా ఇంటర్వ్యూ లో గతంలో తాను ఇండస్ట్రీ గురించి చేసిన వాఖ్యల గురించి మాట్లాడుతూ పదేళ్ల నుండి చాలా మంది వల్ల బాధపడి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అందుకే డిప్రెషన్ నుండి హీల్ అవడానికి ఇండస్ట్రీ లోని అన్ని విషయాలను మీడియా ద్వారా బయటపెట్టాను. దాని వల్ల డిప్రెషన్ నుండి హీల్ అయ్యాను అంటూ గాయత్రి తెలిపారు. ఇక బిగ్ బాస్ సమయంలో జరిగింది నేను పోరాడింది వెరైతే మీడియాలో నేను క్యాస్టింగ్ కౌచ్ కోసం పోరాడినట్లు మార్చేశారు.
నిజానికి నేను వర్క్ ఎత్తిక్స్ కోసం పోరాడను. వాళ్ళు బిగ్ బాస్ కి వచ్చే ముందు కొన్ని రోజులు ఎవరికీ చెప్పకూడదు. ఎక్కడ కనిపించకూడదు ప్రాజెక్ట్స్ చేయకూడదు అని చెప్పినపుడు దానికి వాళ్ళ నుండి డబ్బు రావాలి అది చెప్పలేదు. అలాగే నాతో సంతకం చేయించుకున్న బాండ్ పేపర్ ఒక కాపీ అడిగితే ఇవ్వలేదు దాని కోసం కోర్ట్ కి వెళ్ళాను. కానీ ఆపైన ఆ కేసు డైల్యూట్ అయిపోయింది. ఇక నా హెల్త్ బాగోలేక నేను పట్టించుకోలేదు అంటూ గాయత్రి తెలిపారు. ఇప్పటికి ఎవరైనా నాతో తేడాగా ప్రవర్తిస్తే ఓపెన్ గా చెప్పేస్తాను అంటూ గాయత్రీ తెలిపారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…