Geetha Krishna : చిరంజీవి, పవన్ కళ్యాణ్ రీమేకులనే నమ్ముకుంటారు.. కొత్త కథతో రిస్క్ చేయలేరు.. : డైరెక్టర్ గీతాకృష్ణ

Geetha Krishna : సంకీర్తన సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన గీతా కృష్ణ మొదటి సినిమాతోనే నంది అవార్డు సంపాదించాడు. నాగార్జున తో తీసిన ఈ చిత్రం అప్పట్లో మంచి పేరు తెచ్చుకుంది ఈసినిమా తరువాత కోకిల, సర్వర్ సుందరం గారి అబ్బాయి, కీచురాళ్లు వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక తమిళంలో ప్రభుదేవా తో కలిసి టైం సినిమా తీసాడు. ఇక నిమిదంగల్ సినిమాను 2013 లో తమిళంలో తీసినా పెద్దగా విజయం సాధించలేదు.

చిరంజీవి రీమేక్ లపై ఆధారపడుతాడు…

ఇక తాజాగా పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటు ప్రస్తుత సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అన్ని రీమేక్ సినిమాలను ఎంచుకోవడం గురించి స్పందించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ముందు నుండి రీమేక్ ల మీదే ఆధార పడ్డారని కొత్త కథను తీయాలంటే రిస్క్ చేయాలి కాబట్టి అది వారు చేయలేరని చెప్పారు. ఆయన వయసుకు తగ్గ సినిమాలను ఇంకా ఎన్నో మంచి పాత్రలను ప్రేక్షకులు కోరుకుంటున్నారో ఆయన అటువంటి కథలని ఎంచుకోకుండా రీమేకుల వెంట పడ్డారని వాఖ్యణించారు.

మా లాంటి దర్శకులకు కథ చెప్పే అవకాశం ఇస్తే కొత్తగా చిరుని చూపించడానికి సిద్ధమంటూ చెప్పారు. ఇక ఆచార్య సినిమా పరాజయం గురించి మాట్లాడుతూ ఎపుడైనా అందరు ఇలాంటి సినిమాలను చిరంజీవి నుండి కోరుకుంటున్నారో తెలుసుకోవాలి అంటూ మాట్లాడారు. స్క్రిప్ట్ విషయంలో వేళ్ళు, కాళ్ళు పెట్టకుండా సినిమాను దర్శకుడికి వదిలేస్తే బాగుంటదంటూ వాఖ్యణించారు.