Featured

Jabardasth Varsha: ఎవరు ఏమనుకున్నా ఇమ్మానియేల్ నే పెళ్ళి చేసుకుంటా.. అతనంటే నాకిష్టం : వర్ష

Jabardasth Varsha: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో సుధీర్ రష్మీ ఏ విధంగా క్రేజ్ సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.వీరిద్దరూ కలిసి వేదికపై ఒక పర్ఫామెన్స్ చేశారు అంటే ఆ కార్యక్రమం రేటింగ్ అమాంతం పెరిగి పోతాయి. అందుకే ఎక్కువగా సుధీర్ రష్మీ జోడీకి ఎన్నోసార్లు వేదికపై మల్లెమాల వారి పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే ప్రస్తుతం ఈ జోడిని వెనక్కినెట్టి ఇంతకుమించి పాపులారిటీ సంపాదించుకున్నారు ఇమ్మానియేల్, వర్ష.

Jabardasth Varsha: త్వరలోనే ఇమ్మానియేల్ ను పెళ్లి చేసుకోబోతున్న వర్ష.. ఎట్టకేలకు ప్రేమను బయటపెట్టిన వర్ష?

వీరిద్దరి జోడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్నప్పటికీ వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా ఉండటం వల్ల వీరి పర్ఫార్మెన్స్ కి కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇక సుధీర్ రష్మి విషయంలో జరిగినట్టుగాని వీరి విషయంలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున పలు సందేహాలను వ్యక్తపరిచారు. వీరిద్దరి కెమిస్ట్రీ చూసి వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Jabardasth Varsha: త్వరలోనే ఇమ్మానియేల్ ను పెళ్లి చేసుకోబోతున్న వర్ష.. ఎట్టకేలకు ప్రేమను బయటపెట్టిన వర్ష?

గత కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష ఇమ్మానియేల్ తన రిలేషన్ గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. తనతో ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ రిలేషన్ ఉంది అంటూ పరోక్షంగా తనతో ఉన్న రిలేషన్ గురించి తెలిపారు.ఇకపోతే తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా వర్ష తనలో ఉన్న ప్రేమను మొత్తం బయట పెట్టారు.సాధారణంగా ప్రేమించుకునే వారి మధ్య ఎన్నో అనుమానాలు ఉంటాయి ఇమ్మానియేల్ పై ఎప్పుడూ అలా అనుమానపడలేదా అంటూ ఇంద్రజ అడిగారు.

ఎవరేమనుకున్నా పర్వాలేదు.. నువ్వంటే నాకిష్టం…

ఈ విధంగా ఇంద్రజ అడగడంతో వర్ష మాట్లాడుతూ నా లైఫ్ లో ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇమ్ము మాత్రమే.. ఎవ్వరేమనుకున్నా నో ప్రాబ్లామ్.. ఈ అమ్మయి ఏంటీ? అబ్బాయి ఏంటి అని ఎంతమంది అనుకున్న నాకేం పర్వాలేదు ఇప్పుడు చెబుతున్నా నువ్వంటే నాకిష్టం..చివర్లో ‘ఇమ్ముతో మీ మమ్మీకి చెప్పు.. కోడలు వస్తుందని’అంటూ వర్ష వెళ్లిపోయింది.. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేస్తూ ఇమ్మానియేల్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 minute ago

ఆదివారం బట్టలు ఉతికితే జరిమానా..అసలు కారణం తెలిస్తే ఆశర్యపోతారు.!

భారత్‌లో ఆదివారం అంటే చాలామందికి ఇంటి పనుల రోజు. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కారణంగా వారం మొత్తం బిజీగా గడిపే…

6 minutes ago

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

20 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

21 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

21 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

22 hours ago