ఆంధ్రప్రదేశ్లో మద్యం పర్మిట్ రూమ్లకు తిరిగి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్రంలో పర్మిట్ రూమ్లపై ఉన్న నిషేధాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఎత్తివేసింది.
గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి హయాంలో పర్మిట్ రూమ్లను నిషేధించారు. ప్రస్తుతం, కొత్త ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం, పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేయాలనుకునేవారు సంవత్సరానికి రూ. 5 లక్షలు లేదా రూ. 7.5 లక్షలు చెల్లించి అనుమతి పొందవచ్చు.
కొత్త ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఊరూరా మద్యం బెల్టు షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని, దీనివల్ల నేరాలు పెరుగుతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వడం వల్ల మద్యం విచ్చలవిడిగా లభించే అవకాశం ఉందని, ఇది సామాజిక సమస్యలకు దారితీయవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…