భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు సంఖ్య రెండు లక్షలు దాటడంతో ఇతర దేశాల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి తమ దేశానికి విమానాల రాకపోకలను హంకాంగ్ ప్రభుత్వం నిషేధించింది.ఇటీవల కాలంలో న్యూజిలాండ్ ప్రభుత్వం భారత ప్రయాణికులపై నిషేధం తెలిపిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా హంకాంగ్ ప్రభుత్వం భారత విమానాలకు నిషేధం తెలిపింది.
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్, ఫిలిపిన్స్ దేశాలలో కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఈ మూడు దేశాల నుంచి వచ్చే విమాన రాకపోకలను హాంకాంగ్ ప్రభుత్వం ఈనెల 20 నుంచి 14 రోజుల పాటు నిషేధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.గతవారం ఎన్501వై రకం కోవిడ్ స్ట్రెయిన్ను హాంకాంగ్లో తొలిసారి గుర్తించడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.
ఆదివారం హాంకాంగ్ లో 30 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 29 కేసులు ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులుగా గుర్తించడం గమనార్హం. మార్చి 15వ తేదీ నుంచి హాంకాంగ్ లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు11,600 కేసులు నమోదు కాగా అందులో 209 మంది ప్రాణాలను కోల్పోయారు.
ఈ విధంగా హాంకాంగ్ లో కేసుల సంఖ్య పెరగడంతో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న భారతదేశం, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి విమానాల రాకపోకలను 14 రోజులపాటు నిలిపివేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటుంది.7.5 మిలియన్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పటి వరకు కేవలం తొమ్మిది శాతం మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…