గాల్లో ప్రయాణం చేయాలని ఎంతో మందికి ఎన్నో ఆశలు ఉంటాయి. అయితే ప్రస్తుతం గాలిలో ప్రయాణం చేయాలంటే విమాన ప్రయాణం ఒకటే మార్గం. విమానంలో ప్రయాణించాలంటే ప్రతి ఒక్కరికీ సాధ్యపడదు కనుక ఆ కల కలగానే మిగిలిపోతుంది.అయితే ఈ విధంగా గాలిలో ప్రయాణించాలని కోరిక త్వరలోనే తీరబోతోంది అని ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందయ్ సీఈఓ కీలక ప్రకటనలు చేశారు.
కార్లు గాలిలో ఎగిరే సన్నివేశాలు మనం కేవలం హాలీవుడ్ చిత్రాలలో మాత్రమే చూస్తుంటాము. అయితే నిజంగానే కార్లు గాలిలో ఎగురుతూ ఎలా ఉంటుంది.. ఊహించడానికి ఎంతో ఆనందంగా ఉంది కదూ. అయితే ఈ ఊహను త్వరలోనే నిజం చేయనున్నారు.ఇప్పటికే యూరప్కు చెందిన ఓ కంపెనీ ఎగిరే కారును తయారు చేసి విజయంతంగా ట్రైల్ రన్ నిర్వహించింది. ఎగిరే కార్లకు సంబంధించి తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందయ్ కంపెనీ కూడా కీలక ప్రకటన చేసింది.
గాలిలో ప్రయాణించే కార్లను చూస్తామని ఎప్పుడూ అనుకోలేదు. కానీ రాబోయే అతి తక్కువ రోజులలో ఈ విధంగా గాలిలో ఎగిరే కార్లను చూస్తామని ఈ సందర్భంగా మైఖేల్ పేర్కొన్నారు. సుమారు పది సంవత్సరాలకు అర్బన్ నగరాలలో ఎయిర్ కారు ట్రాన్స్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ విధంగా ఎయిర్ కార్లు అందుబాటులోకి వస్తే పెద్ద పెద్ద నగరాలలో ట్రాఫిక్ సమస్యలతో పాటు వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.
అలాగే ఎంతో సుదూర ప్రాంతాలకు అతి తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు.ఫ్లైయింగ్ కార్లకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని, హ్యూందాయ్ సీఈఓ మైఖేల్ కోల్ పేర్కొన్నారు.
యూరప్లో ఇప్పటికే క్లెన్ విజన్ అనే సంస్థ ఎయిర్ కారును అభివృద్ధి చేసింది. నాలుగు రోజుల క్రితం స్లోవేకియాలో తొలి టెస్ట్ రన్ చేసి విజయంతమయ్యారు. నిట్రా ఎయిర్పోర్టు నుంచి బ్రిటిస్లావా ఎయిర్పోర్టుకు దాదాపు 35 నిమిషాల పాటు గాల్లో ప్రయాణించింది. గంటకు 170 కిలో మీటర్ల వేగంతో కారులో ఇద్దరు కూర్చొని సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…