చలికాలంలో బరువు తగ్గాలంటే.. ఈ పండ్లను తీసుకోండి..!

ఎవరికైనా వయస్సుకు మించి బరువు ఉంటే.. అనేక రోగాలు ముట్టడిస్తాయి. ఏదైనా ఒక్క రోగం వచ్చిందంటే.. ఇక ఒకదాని తర్వాత ఒకటి క్యూ కట్టుకుంటూ వస్తాయి. అందుకే బరువు అనేది మనిషికి చాలా ప్రమాదకరం. అయితే లావు తగ్గాలనుకుంటే ఎవరైనా చెప్పే మొదటి మాట వ్యాయామం. ప్రతీ రోజు కనీసం గంట అయినా వ్యాయామం చేయాలని చెబుతుంటారు.

ఆహార నియమాల్లో కూడా కొన్ని మార్పులను చేస్తుంటారు. ఇవి కాకుండా.. మనం రోజూ తినే డైట్ చార్ట్ లో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.. ప్రస్తుతం చలికాలం. ఈ కాలంలో ఎక్కవగా పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్లు ఏంటో.. ఇప్పడు ఇక్కడ చూద్దాం.. సిట్రస్ జాతి పండ్లను ఎక్కువగా తినాలి.. అంటే అందులో విటమిన్ సీ అధికంగా ఉంటుంది.

దీని వల్ల అధిక బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కివీ పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి.. బరవు తగ్గుతారు. విటమిన్ ఏ, ఫైబర్ అధికంగా ఉన్న పండ్లను తింటే.. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. విటమిన్ ఏ అనేది ఎక్కువగా క్యారెట్లలో ఉంటుంది.

దానిని రోజూ కనీసం ఒకటి తినే విధంగా చూసుకోవాలి. మరో విషయం ఏంటంటే.. వేసవిలో విరివిగా దొరికే .. పుచ్చకాయలను ఈ సిజన్లో కూడా తినొచ్చు. ఫైబర్ అధికంగా ఉండటంతో.. బరువు వెంటనే తగ్గుతారట. నీటి శాతం ఎక్కువగా ఉండటంతో తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు యాపిల్స్, దానిమ్మ పండ్లను కూడా తీసుకోవాలని..దీంతో బరువు తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.