టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకి టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూరి జగన్నాథ్,విజయ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా మైక్ టైసన్ కు సంబంధించిన లుక్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు.
ఈనెల 12వ తేదీన చిత్ర బృందం అమెరికాకు చేరుకోగా ప్రస్తుతం మైక్ టైసన్ అలాగే విజయ్ దేవరకొండ మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు పూరి జగన్నాథ్. తాజాగా మైక్ టైసన్ లైగర్ చిత్ర బృందంతో కలిసాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ మైక్ టైసన్ తో కలిసి కొంచెం వెరైటీగా ఫోటో దిగాడు. అతనితో కలిసి పనిచేయడం పై సంతోషం వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండ ఈ మెమోరీస్ జీవితాంతం గుర్తుంచుకుంటాను అని తెలిపాడు.
ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా, హీరోయిన్ ఛార్మి అలాగే బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఇలా ఈ చిత్ర మొత్తం బృందానికి లైగర్ తొలి పాన్ ఇండియా మూవీ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…