ఎవరికైనా వయస్సుకు మించి బరువు ఉంటే.. అనేక రోగాలు ముట్టడిస్తాయి. ఏదైనా ఒక్క రోగం వచ్చిందంటే.. ఇక ఒకదాని తర్వాత ఒకటి క్యూ కట్టుకుంటూ వస్తాయి. అందుకే బరువు అనేది మనిషికి చాలా ప్రమాదకరం. అయితే లావు తగ్గాలనుకుంటే ఎవరైనా చెప్పే మొదటి మాట వ్యాయామం. ప్రతీ రోజు కనీసం గంట అయినా వ్యాయామం చేయాలని చెబుతుంటారు.
ఆహార నియమాల్లో కూడా కొన్ని మార్పులను చేస్తుంటారు. ఇవి కాకుండా.. మనం రోజూ తినే డైట్ చార్ట్ లో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.. ప్రస్తుతం చలికాలం. ఈ కాలంలో ఎక్కవగా పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్లు ఏంటో.. ఇప్పడు ఇక్కడ చూద్దాం.. సిట్రస్ జాతి పండ్లను ఎక్కువగా తినాలి.. అంటే అందులో విటమిన్ సీ అధికంగా ఉంటుంది.
దీని వల్ల అధిక బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కివీ పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి.. బరవు తగ్గుతారు. విటమిన్ ఏ, ఫైబర్ అధికంగా ఉన్న పండ్లను తింటే.. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. విటమిన్ ఏ అనేది ఎక్కువగా క్యారెట్లలో ఉంటుంది.
దానిని రోజూ కనీసం ఒకటి తినే విధంగా చూసుకోవాలి. మరో విషయం ఏంటంటే.. వేసవిలో విరివిగా దొరికే .. పుచ్చకాయలను ఈ సిజన్లో కూడా తినొచ్చు. ఫైబర్ అధికంగా ఉండటంతో.. బరువు వెంటనే తగ్గుతారట. నీటి శాతం ఎక్కువగా ఉండటంతో తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు యాపిల్స్, దానిమ్మ పండ్లను కూడా తీసుకోవాలని..దీంతో బరువు తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…