రైలు కూత మొదలైంది. ఈరోజు నుంచి 15 ప్రధాన నగరాలకు రైళ్లు నడుపుతుంది రైళ్ల శాఖ. ఇందుకోసం 30 సర్వీసులను నడుపుతోంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంది. ఈ క్రమంలో ప్రతి కోచ్ లో 72 మంది ప్రయాణికులు మించకుండదు జాగ్రత్తలు తీసుకుంటోంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, దిబ్రూగఢ్, అగర్తలా, రాంచీ, భువనేశ్వర్, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు, మడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రైళ్లను నడుపుతుంది రైల్వే శాఖ. ఈ నేపథ్యంలో ట్రైన్ చార్జీలు, బయలుదేరే వేళలు, ప్రయాణించే వేళలు అన్ని రాజధాని రైళ్ల నియమాలు వర్తిస్తాయని తెలిపింది. ఏసీ అవసరమైనంత ఉష్ణోగ్రతలో మాత్రమే నడుస్తుందని స్పష్టం చేసింది. మరో వైపు ఏసీ కోచ్ లలో దుప్పట్లు, బెడ్ షీట్లు ఇవ్వబోమని తెలిపింది.
కాగా, తెలుగు రాష్ట్రాలలో ఆగే రైళ్లు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఢిల్లీ నుంచి బెంగళూర్ వెళ్లే రైలు ఆంద్రప్రదేశ్ లోని గుంతకల్ జంక్షన్, అనంతపురం స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఇక అదే రైలు తెలంగాణలో సికింద్రాబాద్ లో మాత్రమే ఆగుతుంది. ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు ఉంది. కానీ ఇది కేవలం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో మాత్రమే ఆగుతుందని స్పష్టం చేసింది. కాగా, రేపు నడుపనున్న ఢిల్లీ – చెన్నై రైలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ రైల్వేస్టేషన్ లో ఆగుతుంది. అదే రైలు తెలంగాణాలో వరంగల్ రైల్వే స్టేషన్ లో మాత్రమే ఆగుతుంది.
భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…
నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…
హిందూ పంచాంగంలో ప్రతి పర్వదినానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో వైశాఖ మాసంలో వచ్చే పరశురామ ద్వాదశి కూడా…
ఇప్పటి పోటీ ప్రపంచంలో కెరీర్లో ఎదగడం అనేది చాలామందికి పెద్ద సవాలుగా మారింది. మంచి విద్య, కష్టపడే స్వభావం ఉన్నా…
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో మంత్రజపానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఏకాగ్రత పెంచుకోవడం, దైవానుభూతిని పొందడం వంటి…