ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్…తాజగా తీవ్రమైన జలుబుతో బాధపడుతూ కనిపించారు. నిన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో అయన జలుబు, తుమ్ములతో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం ఇదే ఆయనపై విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే… సోమవారం అయన సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్టైల్స్ పార్క్లో పలు అభివృద్ది పనులను పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సెంట్రల్ లైటింగ్, పరిపాలన భవనం, కార్మికుల భోజశాల, కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన అయన నాలుగైదు చోట్ల జలుబుతో తుమ్ముతు కనిపించారు.
అదే సమయంలో ఎప్పుడు చేతిరుమాలు కూడా దగ్గర ఉంచుకొని మంత్రి ఈసారి మాత్రం గులాబీ రంగు రుమాలు మాత్రం భుజాన వేసుకుని తిరిగారు. అయితే మంత్రి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు భయంతో కాస్త దూరం జరుగుతూ కనిపించారు. దీనికి సంబంధిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో జలుబుతో బాధపడుతున్న మంత్రి ఇలా బయట తిరగడంపై కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక ఆలయంలో భారీ గంటను ఒక్క చేత్తో మోగిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న వృద్ధ మహిళ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…
టాలీవుడ్లో తన ప్రత్యేకమైన కామెడీ స్టైల్తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు మహేష్ విట్టా తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.…
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న వేళ, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకోవడం…
వేసవి వేడి రోజురోజుకు పెరుగుతున్న ఈ సమయంలో చల్లని పానీయాలపై ఆసక్తి సహజం. అయితే మార్కెట్లో లభించే కూల్డ్రింక్స్, సోడాలు…
ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లలో అనియంత్రణ వల్ల జీర్ణ సమస్యలు సాధారణంగా మారాయి. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి…
ఇటీవలి కాలంలో చర్మ సంరక్షణలో కొత్త ట్రెండ్గా “కాఫీ బట్టర్” (Coffee Butter) ప్రాచుర్యం పొందుతోంది. సహజ పదార్థాలతో చర్మాన్ని…