interesting details about relationship between rajamouli and actor harsha vardhan
Director Rajamouli : తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి సినిమా అంటే ఇష్టముండని వారుండగారు. ఆయన తీసిన ప్రతీ సినిమాలో ఏదో కొంత విషయం ఉండడంతో పాటు అన్ని హంగులు కనిపిస్తాయి. రాజమౌళి సినిమాలో స్టార్ హీరో నటించినా.. హీరో కంటే ఎక్కువగా ఈ దిగ్గజ దర్శకుడికే పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇక ‘బాహుబలి’ సినిమాల తరువాత రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.
విదేశాల్లోనూ రాజమౌళికి ప్రత్యేకంగా అభిమానులు ఉండడం విశేషం. అయితే అమృతం సీరియల్తో పాపులర్ అయిన హర్షవర్ధన్కి సినిమాల్లో అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి. డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి నటుడై నిరూపించుకున్నా దర్శకుడు కావాలన్న ఆశ మాత్రం చావలేదు అని తెలుస్తుంది. తనలోని రైటర్ని కూడా నిద్ర లేపి ఇష్క్, గుండెజారి గల్లంతయ్యింది వంటి చిత్రాలకు సంభాషణలు సమకూర్చారు హర్ష.
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిన అది కుదరలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న హర్షవర్ధన్ రాజమౌళి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఏంటా అని ఆలోచిస్తున్నారా… హర్ష వర్ధన్ కి దర్శక ధీరుడు రాజమౌళి కి ఉన్న సంబంధం.
రాజమౌళి అప్పట్లో దర్శకత్వం వహించిన శాంతినివాసం అనే సీరియల్ కి హర్షవర్ధన్ రైటర్ గా పని చేశారని తాజాగా వెల్లడించారు. అలానే నా రైటింగ్ స్కిల్స్ అంటే రాజమౌళి కి ఎంతో ఇష్టం, దాదాపు 15 ఎపిసోడ్స్ కి పైగా ఆయన నాతో డైలాగ్స్ రాయించడమే కాకుండా, నాకోసం ఒక్క ప్రత్యేకమైన పాత్రని కూడా అద్భుతంగా డిసైన్ చేసారు అంటూ చెప్పుకొచ్చారు. అలా ఆ పాత్రకి నాకు ఎంతో పేరు వచ్చింది అని వారి మధ్య ఉన్న బంధం గురించి వివరించారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…