ఓ తమిళ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న సుమన్, భానుచందర్ ఇద్దరు కాస్త విరామం దొరకడంతో.. మధ్యాహ్నం యూనిట్ సభ్యులు లంచ్ ఏర్పాటు చేశారు. టేబుల్ పై భోజనం చేస్తున్న సుమన్ ని కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తున్న భానుచందర్ ను ఏమిటి అలా చూస్తున్నారని సుమన్ ప్రశ్నించాడు. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు తెలుగు సినిమాల్లో ఎందుకు నటించకూడదని సుమన్ ను భానుచందర్ ఆతృతగా అడిగాడు. నాకు తెలుగు భాషలో ఓనమాలు కూడా రావు అలాంటిది తెలుగు సినిమాలలో నటించగలనా అని సుమన్ నెమ్మదిగా బదులిచ్చాడు.
నువ్వు తెలుగులో నటించు కేవలం మూడు నెలల్లో తెలుగు చాలా చక్కగా మాట్లాడుతావు. పైగా మాకు తెలుగు నేర్పించేంతగా భాషాపటిమ నీకు వస్తుందని సుమన్ తో భానుచందర్ చెప్పారు. అలా అన్నదే తడవుగా సుమన్ ని వెంటపెట్టుకొని తెలుగు సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ను కలిసి సుమన్ ని తెలుగులో పరిచయం చేయాలని భానుచందర్ ఆయనను కోరారు. ఆ విషయం పట్ల స్పందించిన నిర్మాత భరద్వాజ్ సుమన్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. తమిళ సినిమా చేస్తున్న క్రమంలో ఒకరినొకరు కరాటేలో బ్లాక్ బెల్ట్ గా పరిచయం చేసుకుని అందులోని పోరాట సన్నివేశాలను వారిద్దరు చక్కగా చేశారు. భారతదేశంలో ఇంతవరకూ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా ఒక్క సినిమా కూడా రాలేదు. కావున ఇద్దరు హీరోలు, నాలుగు పాటలు, ఎనిమిది ఫైట్లతో ఒక కథ సిద్ధం చేయండని నిర్మాత భరద్వాజ్ కు భాన్ చందర్ సలహా ఇచ్చారు.
ఆ క్రమంలో అప్పటి అప్ కమింగ్ రైటర్ భరత్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో మంచి కథ తయారు చేశారు. ఆ కథకి అనుగుణంగా రచయిత కాశీ విశ్వనాథ్ సంభాషణలు అందించారు. కథ మాటలు చక్కగా కుదరడంతో ఈ సినిమాకి దర్శకునిగా అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ గా ఎదుగుతున్న రేలంగి నరసింహారావు ని తీసుకున్నారు. 1983 చరితచిత్ర బ్యానర్, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాణం, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో “ఇద్దరు కిలాడీలు” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో సుమన్, భానుచందర్, సాధన హీరో, హీరోయిన్లుగా నటించారు. మరో ప్రధాన పాత్రలో జయసుధ కనిపించారు. సుమన్, భాన్ చందర్ తెలుగులో నటించిన “ఇద్దరు కిలాడీలు” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా చూసిన ఆనాటి తెలుగు యువత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఆసక్తి కనబరచడం ఓ విశేషం. సుమన్, భానుచందర్ ఇద్దరూ ఈ చిత్రం తర్వాత అనేక తెలుగు చిత్రాల్లో నటించారు.
కేవలం, మహా అయితే పది సంవత్సరాలు తెలుగు సినిమాల్లో నెట్టుకోస్తాం అని అనుకున్నా సుమన్ దాదాపు 40 సంవత్సరాలు గడిచిన కూడా ఇంకా తెలుగు సినిమాలలో సుమన్ నటించడం గమనించ దగిన విషయం. ఆయన నటుడిగా ఇద్దరు కిలాడీలు, తరంగిణి, నేటిభారతం, మెరుపుదాడి, 20వ శతాబ్దం, చిన్న అల్లుడు, పెద్దింటల్లుడు, బావ బావమర్ది, మొండి మొగుడు పెంకి పెళ్ళాం లాంటి చిత్రాలు సుమన్ కి పేరును తీసుకురాగా.. మన ఊరి పాండవులు, ఏది న్యాయం, ఏది ధర్మం, నిరీక్షణ, ముక్కుపుడక, ఇద్దరి కిలాడీలు, మెరుపుదాడి, లాయర్ సుహాసిని, నేటిదౌర్జన్యం, అలజడి, అశ్విని, సూత్రదారులు, సింధూరం లాంటి చిత్రాలు భానుచందర్ కి మంచి పేరును తీసుకువచ్చాయి.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…