ఒకప్పుడు పలు సినిమాలలో హీరోయిన్ గా కొనసాగిన వారు తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై కొనసాగిస్తున్నారు. ఈక్రమంలోనే అన్నమయ్య చిత్రంలో నటించి అందరిని మెప్పించిన నటి కస్తూరి ప్రస్తుతం బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇలా సినిమాలలోను సీరియల్స్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కస్తూరి తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని తన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.తన జీవితంలో తాను చావును మూడుసార్లు దగ్గరగా చూశానని రెండు సార్లు తన తల్లిదండ్రుల రూపంలో వస్తే ఒకసారి తన కూతురి రూపంలో చావు చూశానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
తన కూతురు లుకేమియా వ్యాధితో బాధ పడిందని.ఏకంగా మూడు సంవత్సరాల పాటు మంచానికే పరిమితమైన తన కూతురిని చూస్తూ ఎంతో నరకం అనుభవించానని ఎంతో ధైర్యంతో ముందుకు వెళుతూ తన కూతురిని ఆ నరకం నుండి రక్షించుకున్నానని తెలిపారు.
తన కూతురుకు అనారోగ్యం చేసిన సమయంలోనే తనకు బాబు కూడా పుట్టాడని ఆ మూడు సంవత్సరాలు బాబుకు దూరంగా ఉంటూ ఎంతో బాధను భరించానని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం తన కూతురు కొడుకు ఇద్దరూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇక ఈమె స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…