ఒకప్పుడు పలు సినిమాలలో హీరోయిన్ గా కొనసాగిన వారు తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై కొనసాగిస్తున్నారు. ఈక్రమంలోనే అన్నమయ్య చిత్రంలో నటించి అందరిని మెప్పించిన నటి కస్తూరి ప్రస్తుతం బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇలా సినిమాలలోను సీరియల్స్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కస్తూరి తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని తన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.తన జీవితంలో తాను చావును మూడుసార్లు దగ్గరగా చూశానని రెండు సార్లు తన తల్లిదండ్రుల రూపంలో వస్తే ఒకసారి తన కూతురి రూపంలో చావు చూశానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
తన కూతురు లుకేమియా వ్యాధితో బాధ పడిందని.ఏకంగా మూడు సంవత్సరాల పాటు మంచానికే పరిమితమైన తన కూతురిని చూస్తూ ఎంతో నరకం అనుభవించానని ఎంతో ధైర్యంతో ముందుకు వెళుతూ తన కూతురిని ఆ నరకం నుండి రక్షించుకున్నానని తెలిపారు.
తన కూతురుకు అనారోగ్యం చేసిన సమయంలోనే తనకు బాబు కూడా పుట్టాడని ఆ మూడు సంవత్సరాలు బాబుకు దూరంగా ఉంటూ ఎంతో బాధను భరించానని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం తన కూతురు కొడుకు ఇద్దరూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇక ఈమె స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…