ఒకప్పుడు పలు సినిమాలలో హీరోయిన్ గా కొనసాగిన వారు తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై కొనసాగిస్తున్నారు. ఈక్రమంలోనే అన్నమయ్య చిత్రంలో నటించి అందరిని మెప్పించిన నటి కస్తూరి ప్రస్తుతం బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇలా సినిమాలలోను సీరియల్స్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కస్తూరి తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని తన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.తన జీవితంలో తాను చావును మూడుసార్లు దగ్గరగా చూశానని రెండు సార్లు తన తల్లిదండ్రుల రూపంలో వస్తే ఒకసారి తన కూతురి రూపంలో చావు చూశానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
తన కూతురు లుకేమియా వ్యాధితో బాధ పడిందని.ఏకంగా మూడు సంవత్సరాల పాటు మంచానికే పరిమితమైన తన కూతురిని చూస్తూ ఎంతో నరకం అనుభవించానని ఎంతో ధైర్యంతో ముందుకు వెళుతూ తన కూతురిని ఆ నరకం నుండి రక్షించుకున్నానని తెలిపారు.
తన కూతురుకు అనారోగ్యం చేసిన సమయంలోనే తనకు బాబు కూడా పుట్టాడని ఆ మూడు సంవత్సరాలు బాబుకు దూరంగా ఉంటూ ఎంతో బాధను భరించానని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం తన కూతురు కొడుకు ఇద్దరూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇక ఈమె స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…