సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎనలేని మార్పు వచ్చాయి. కథ, బడ్జెట్, హీరో హీరోయిన్స్ రెమ్యునరేషన్, సినిమా మేకింగ్, టెక్నాలజీ ఇలా ఇప్పుడు కొత్తగా చేరిన రెండు విభాగాలు సహా 24 విభాగాలలో జనరేషన్ తో పాటు సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ వల్ల ఊహించని మార్పులు వచ్చాయి. ఇప్పుడు సినిమాకి సంబంధించి ఏది మాట్లాడినా కోట్లలోనే అంటున్నారు. రచయిత కథ రాయాలంటే ఏ ఊటికో వెళ్ళి సిట్టింగ్ వేయాలి. గతంలో మాదిరిగా నాలుగు గోడల మధ్యనో లేక స్టూడియోలోనో కూర్చుంటేనో కథ పుట్టడం లేదు. మన పూరి జనగన్నాథ్ అయితే కొత్త ఐడియా రావడం ఆలస్యం బ్యాంకాక్ వెళ్ళిపోతారు.
ఒక్క పూరి జగన్నాథ్ మాత్రమే కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శక, రచయితలు కథ రాయాలని వేరే ప్రదేశాలకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి నిర్మాతకి మొదలైన ఖర్చు ఫస్ట్ కాపీ వచ్చి థియోటర్స్లో బొమ్మ పడేవరకు మంచి నీళ్ళలా డబ్బు ఖర్చు చేస్తూనే ఉంటాడు. మ్యూజిక్ డైరెక్టర్స్ సిట్టింగ్ అని ఎక్కడికో వెళ్ళడం మామూలైపోయింది. పబ్లిసిటీ కూడా డిజిటల్ ఫార్మాట్ అంటూ ఎన్ని రకాలుగా చేయాలో అన్నీ రకాలుగా చేస్తున్నారు. ఆ రోజుల్లో సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడగానే ఓ రిక్షాలో త్వరలో విడుదల, మీ అభిమాన థియోటర్స్లో నేడే విడుదల అంటూ మైక్ పట్టుకొని చెప్తూ తిరిగేవారు.
ఇప్పుడు సోషల్ మీడియాలోనే సినిమా ప్రమోషన్స్ జరిగిపోతున్నాయి. ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చేతిలో ప్రపంచాన్ని చూడొచ్చు. అలాగే కావాల్సిన సినిమాను ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. అందుకే హీరో, హీరోయిన్స్ రెమ్యునరేషన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి పెళ్ళి చేసుకునే సమయానికి ఆమె అందుకునే రెమ్యునరేషన్ 50 వేలట. ఆ 50 వేలు ఇప్పుడు దేనికీ సరిపోతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా బడ్జెట్ సగం అయితే హీరో, హీరోయిన్స్ అందుకునే రెమ్యునరేషన్..వాళ్ళ మెయింటైనెన్స్ సగం బడ్జెట్ అవుతోంది.
ఓ స్టార్ హీరోయిన్ కి కథలో పెద్దగా స్కోప్ లేకపోయినా ఆమె ఉంటే క్రేజ్ వస్తుందని హీరో పాటల కోసం కోటి నుంచి రెండు మూడు కోట్లు ఇచ్చి మరీ తీసుకు వస్తున్నారు. వీరికి మేకప్, కాస్ట్యూం చేంజ్, హెయిర్ స్టైల్ కోసం అలాగే పర్సనల్గా కూర్చొని రిలాక్స్ అవడానికి ఓ క్యారవ్యాన్ పెట్టాలి. దాదాపు ఇప్పుడున్న స్టార్ హీరోలందరికి సొంతగా ఖరీదైన క్యారవ్యాన్ ఉంది. కానీ హీరోయిన్స్ సౌకర్యం కోసం అద్దెకి ఇలాంటి క్యారవ్యాన్స్ తీసుకు రావాల్సిందే. లేదంటే హీరోయిన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.
అదే ఆ రోజుల్లో అయితే అవుట్ డోర్ షూటింగ్స్ వెళ్ళినప్పుడు మేకప్ వేసుకునే దగ్గర్నుంచి భోజనాల వరకు అన్నీ చెట్ల కిందనే జరిగిపోయేవి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి అనుమతులు తీసుకొని అల్లూరి సీతారామరాజు, అడవి దొంగ, కొండవీటి దొంగ, అడవి రాముడు లాంటి ఎన్నో సినిమాలు అడవుల్లో చేశారు. అక్కడ కనీసం టెలిఫోన్ సదుపాయం కూడా ఉండేది కాదు. అంతెందుకు సిటీకి చాలా దూరం ఫారెస్ట్ లొకేషన్ ఉంటే రాత్రిళ్లు అక్కడే ప్రొడక్షన్స్ వ్యానుల్లో, సొంత కారూలోనూ గడిపేవారు.
అంతేకాదు సీన్స్ కోసం హీరోయిన్స్ గానీ, హీరోలు గానీ ఇతర ఏ ఆర్టిస్టులైనా డ్రెస్ ఛేంజ్ చేసుకోవాలంటే చెట్ల చాటుకు వెళ్ళి ఛేంజ్ చేసుకునేవారు. అన్నీ ఇబ్బందులు పడి కూడా హీరోయిన్స్ దర్శక నిర్మాతలకి సపోర్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు చిన్న విషయానికే అలిగెళ్ళిపోతున్న హీరోయిన్స్ ఉన్నారంటే ఎన్ని మార్పులు, యాటిట్యూడ్ వచ్చాయో అర్థం చేసుకోవచ్చు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…