ఎక్కడో హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం ఆ తరువాత బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాదు దేశంలోని అన్ని ఇండస్టీలలో ఊపందుకుంది. గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చాలా మంది హీరోయిన్లు, నటీమణులు ఎంతో ధైర్యంగా బయటకు వచ్చి మీడియా ముందు తమకు జరిగిన లైంగిక వేధింపులను వివరించారు.
బాలీవుడ్ లో ముందుగా తనుశ్రీ దత్త మొదలుపెట్టిన మీటూ ఉద్యమం ఆ తరువాత ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వారు మీడియా ముందు బయటపెట్టారు. ప్రముఖ నటుడు నానాపటేకర్ పై తనుశ్రీ దత్త చేసిన లైంగిక ఆరోపణలతో మీటూ ఉద్యమం ఊపందుకుంది. తాజాగా మీటూ ఉద్యమంపై నటి కాజోల్ మాట్లాడుతూ మీటూ వల్ల ఇండస్ట్రీకి మంచే జరిగిందని.. దాని వల్ల చాలా మంది నటులు, దర్శకులు ఇండస్ట్రీలోని మహిళలతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలిపింది.
దీనిపై కియారా మాట్లాడుతూ మీటూ ఉద్యమం వల్ల ఒరిగిందేమీ లేదని, మీటూ వల్ల ప్రపంచం ఏమి మారిపోలేదని తెలిపింది. మీటూ వల్ల పెద్ద మార్పేమీ రాలేదని పేర్కొంది. మీటూ ఇంకా తర్వాతి దిశకు చేరుకోలేదని అభిప్రాయపడింది. మీటూ ఫలితం ఇంకా రాలేదని కియారా అద్వానీ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటుంది. తెలుగులో కూడా ఒక సినిమా చేయబోతుంది. ఈ సినిమాకు సంబందించిన విషయంలో త్వరలో బయటకురానున్నాయి.
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…