Karthikeya 2: ప్రస్తుత కాలంలో ఒక సినిమా హిట్ అయింది అంటే దానికి సీక్వెల్ చిత్రం రావడం గమనార్హం. ఈ క్రమంలోనే 2014లో చందు మొండిటి దర్శకత్వంలో నిఖిల్ కలర్స్ స్వాతి జంటగా నటించిన చిత్రం కార్తికేయ. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కార్తికేయ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇప్పటికే సినిమా షూటింగ్ పనులన్నిటిని పూర్తి చేసుకొని ఈనెల 13వ తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాలో నిఖిల్ సరసన కలర్స్ స్వాతి కాకుండా ఆమె స్థానంలోకి అనుపమ పరమేశ్వరన్ వచ్చారు.ఇలా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో నటించడానికి గల కారణం ఏంటి అని పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేశారు.కార్తికేయ సినిమాలో నటించిన కలర్ స్వాతిని కావాలని పక్కన పెట్టి ఆమె స్థానంలో ఈమెను తీసుకున్నారా అనే సందేహం కూడా వ్యక్తం చేశారు.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న హీరో నిఖిల్ కి సైతం ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే కలర్స్ స్వాతి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఈయన క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ కార్తికేయ సినిమాలో కలర్స్ స్వాతి నటన ఎంతో అద్భుతంగా ఉంది అయితే ఈ సినిమాలో ఆమెను తీసుకోకపోవడానికి ఒక కారణం ఉందనీ తెలిపారు.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర నార్త్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి లుక్ కనిపించాల్సి ఉంటుంది. ఇక కలర్స్ స్వాతి అచ్చు తెలుగు అమ్మాయిలా ఉండటం వల్ల తనని ఈ పాత్ర నుంచి తప్పించి ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్లు ఈ సందర్భంగా నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన హీరోయిన్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…