ఒకప్పుడు అన్నమయ్య,భారతీయుడు వంటి చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ కస్తూరి శంకర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మి వంటి సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్న కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. చదివినది లాయర్ చదువు కావడంతో సమాజంలో జరిగే సమస్యలు, అన్యాయాలను ఎదిరిస్తూ కామెంట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈమె చేసే ట్వీట్స్ కొన్నిసార్లు వివాదాలకు దారి తీస్తుంటాయి.
తాజాగా కస్తూరి శంకర్ పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఘటనలపై స్పందించారు.బెంగాల్లో ఎన్నికల తరువాత కూడా హింస యథేచ్చగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అక్కడ జరిగే అల్లర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అక్కడకు రావడంతో అతనిపై రాళ్ల దాడి జరగడంతో ఈమె స్పందించారు.
ఒక కేంద్ర మంత్రి హోదాలో ఎంతో సెక్యూరిటీతో వచ్చినమంత్రి పై ప్రజలు దాడి చేస్తే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఒక కేంద్ర మంత్రికి ఈ విధమైనటువంటి సంఘటన జరిగితే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో ఊహించలేకపోతున్నాను. అసలు వాళ్ళు మనుషులేనా? అది గూండా రాజ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా గౌరీశంకర్ పశ్చిమ బెంగాల్ ఘటనపై జరిగిన సంఘటనకు స్పందించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…