జనరల్ నాలెడ్జ్ రూపంలో ఒక రియాల్టీ షోగా మన ముందుకు వస్తున్నది కేబీసీ (కౌన్ బనేగా కరోడ్పతి). దీనికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తన్న విషయం తెలిసిందే. ఈ షో ద్వారా రూ.కోటి గెలుచుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఈ షోకి హిందీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంది. ఈ షో వస్తుందంటే చాలు.. టీవీల ముందు వాలిపోతారు.
తెలుగులో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కూడా దాని నుంచి స్పూర్తి పొందిందే. కంటెస్టంట్ల విషయంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా వాళ్ల జీవితాల్లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను అందరికీ పరిచయం చేస్తూ ఈ షో ముందుకు నడిపిస్తున్నారు. అప్పుడప్పుడు జోక్స్ కూడా వేస్తుంటారు అబితాబ్. సెలెబ్రిటీలు కూడా అప్పుడప్పుడు మెరుస్తుంటారు.
తాజాగా ఈ షోకి యాక్షన్ హీరో జాన్ అబ్రహం హాజరయ్యాడు. అతడి తాజా చిత్రం సత్యమేవ జయతే 2 ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ దివ్యా ఖోస్లా కుమార్తో కలిసి షోలో పాల్గొన్నాడు. తాజాగా దీనికి సంబంధించి ప్రోమో విడుదల చేశారు. కొన్ని విషయాలను పంచుకున్నారు. అతడి వేలిపై ఫుట్ బాల్ ను తిప్పి ఆకట్టుకున్నాడు. ఇదే ప్రయత్నం బిగ్ బీ చేయగా ఫెయిల్ అయ్యాడు. తన సిక్స్ ప్యాక్ కూడా చూపించాడు. ఇక తన ధూమ్ సినిమాకు సంబంధించి విషయాలను గుర్తు చేసుకున్నారు.
ధూమ్ సినిమా రిలీజ్ రోజున తాను మీ దగ్గరకు బైక్ పై వచ్చాను.. అప్పుడు మీరు ఈ విషయంలో అభిషేక్ ను ప్రోత్సహించొద్దు అని అన్నారు.. తర్వాత అభిషేక్ కిందకు రాగానే ‘వావ్ బైక్ బాగుంది’ అంటూ తనతో మాట మార్చారు అని గుర్తు చేశారు. దానికి అబితాబ్ నవ్వాడు. తర్వాత ఏ విషయం గురించో ఈషోలో మాట్లాడి.. కన్నీరు పెట్టుకున్నాడు జాన్. దానికి గ్యాలరీలో ఉన్న వాళ్లు కూడా బాధపడ్డారు. అయితే జాన్ ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…