Krishnam Raju : నిన్న తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో కృష్ణం రాజు గారు తుది శ్వాస విడిచారు. ఆయన మరణించిన తరువాత ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. రాజుల వంశంలో పుట్టడం కాదు కృష్ణం రాజు గారు నిజంగా రాజే అన్నట్లు గా తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యల వల్ల కృష్ణం రాజు గారు మరణించారు. ఆయన కరోనా సోకిన తరువాత కిడ్నీ పనితీరు చెడిపోయింది. ఇక కరోనా నుండి కోలుకున్నా కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల ఆయన చాలా కాలం నుండి ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇక నిన్న ఉదయం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతు తుది శ్వాస విడిచారు. ఇక అయనను స్మరిస్తూ చాలా మంది సిని, రాజకీయ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
మీకు సినిమా క్యారెక్టర్స్ లేకుండా చేయమంటారా….
ఇక సీనియర్ నటుడు కైకల సత్యనారాయణ గారు కృష్ణం రాజు గారి మరణం గురించి స్పందించారు. ఎప్పటిలాగే హాస్పిటల్ నుండి క్షేమంగా తిరిగివస్తాడని అనుకున్నాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ‘ద్రోహి’ సినిమా సమయం నుండి కృష్ణం రాజు తెలుసు ఇక అప్పటి మా పరిచయం స్నేహంగా మారి ఇప్పటి వరకు కొనసాగుతున్న వచ్చింది అంటూ కైకలా చెప్పారు. సహజంగా నాకు ఎన్టీఆర్ గొంతు తప్ప వేరే వాళ్ళది నచ్చదని ద్రోహి సినిమా చుసినపుడు ఎవరు కృష్ణం రాజుకి డబ్బింగ్ చెప్పారు అని ఆలోచించాను.
ఇక సినిమా చూసాక అల్లు రామలింగయ్య తో అడిగాను ఏమయ్యా లింగయ్య కృష్ణం రాజుకి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని అడిగాను అయితే తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు అని చెప్పగా ఆశ్చర్యంగా అనిపించింది. గంభీరమైన డైలాగులు, కవితలను చక్కగా చెప్పడం గమనించాను ఆ రోజు నుండి ఆయన గొంతు నాకూ బాగా నచ్చింది అంటూ కృష్ణం రాజు గారి గురించి చెప్పారు. ఇక అలా ఒక సందర్భంలో మాట్లాడుతూ చాలా చక్కగా డైలాగులు చెబుతున్నావ్ నువ్వు మరిన్ని చిత్రల్లో నటించాలి అని చెప్పగా ఏంటండీ మీకు సినిమాల్లో పాత్రలు లేకుండా చేయాలా అంటు సరదాగా అన్నాడు. నాకంటే చిన్నవాడు అయిన కృష్ణం రాజు తో మంచి అనుబంధం ఉందని చెప్పారు కైకల సత్యనారాయణ.
మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…
వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…
ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…
రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…
మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…