Lakshmi Parvathi : తారకరత్న హాస్పిటల్ బిల్ విజయ సాయిరెడ్డి గారే కట్టారు…: లక్ష్మి పార్వతి

Lakshmi Parvathi : నందమూరి తారకరత్న మరణం గురించి ఏదో ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ఆయన మరణించి దాదాపు పది రోజులు కావొస్తున్నా ఈ చర్చలు ఆగడం లేదు. లక్ష్మి పార్వతి వంటి వారైతే అతను ఎపుడో మరణిస్తే దాచి పెట్టి 23 రోజుల తరువాత ప్రకటించారంటూ ఆరోపించారు. ఇక తారకరత్న కుటుంబానికి నందమూరి ఫ్యామిలీ నుండి బాలకృష్ణ అండగా నిలబడగా ఇటు అలేఖ్య రెడ్డి కుటుంబం నుండి విజయసాయి రెడ్డి అండగా నిలబడ్డారు. ఇక తాజాగా తారకరత్న హాస్పిటల్ లో చికిత్సకి అయిన బిల్ మొత్తం కట్టింది విజయ సాయి రెడ్డి అంటూ లక్ష్మి పార్వతి కామెంట్స్ చేసారు.

బిల్ కట్టింది విజయ సాయి రెడ్డి.. బాలకృష్ణ చూసుకున్నాడు…

తారకరత్న గుండెపోటుతో దాదాపు 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ లో వెంటిలేటర్ మీద చికిత్స తీసుకున్నారు. అయితే ఆయన ట్రీట్మెంట్ కి అయిన ఖర్చంతా బాబాయ్ బాలకృష్ణ చూసుకున్నారు అనే మాటలు వినిపించినా తాజాగా లక్ష్మి పార్వతీగారు మాట్లాడుతూ మొత్తం హాస్పిటల్స్ ఖర్చు విజయ సాయి రెడ్డి గారు చూసుకున్నారు నాకు తెలుసు అంటూ చెప్పారు.

బాలకృష్ణ తారకరత్న కుటుంబానికి సహాయంగా ఉన్నారు. విజయ సాయి రెడ్డి, బాలకృష్ణ గారే వారి కుటుంబానికి అండగా నిలబడ్డారు అంటూ కామెంట్స్ చేసారు. అయితే మొత్తం ఖర్చు అంతా విజయ సాయి రెడ్డిదే అంటూ మాట్లాడారు. ఇక చంద్రబాబు కేవలం చూసి పోవడమే తప్ప ఎలాంటి సహాయం చేయలేదు అంటూ మండిపడ్డారు.