Preethi Suicide Issue : ర్యాంగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వరంగల్ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులు మృత్యువుతో పోరాడి చివరకు మరణించింది. ఆమె కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సెకండ్ ఇయర్ విద్యార్థి సైఫ్ రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు మీడియా ముందు పెట్టారు. అందులో వాట్సాప్ చాట్ లో ప్రీతిని హేళనగ మాట్లాడినట్లు ప్రీతి విషయంలో జరిగిన అవమానాలు గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
కులం పేరుతో అవమానం…
ప్రీతి గత నవంబర్ లో కాకతీయ యూనివర్సిటీ లో పీజీ చేరగా సైఫ్ కింద టీంలో కొనసాగింది. ఒక ఆక్సిడెంట్ కేసులో రిపోర్ట్ ను ప్రీతి రాయగా అది సరిగా రాయలేదని సైఫ్ అందరి ముందు ఆమెను అవమానించాడు. రిజర్వేషన్ లో సీటు వచ్చిందంటూ హేళన చేయడంతో ప్రీతి నీలదీసింది. ప్రీతి నిలదీయడం నచ్చని సైఫ్ ఆమెకు ఎక్కువగా నైట్ డ్యూటీలను ఇవ్వమని మిగిలిన సీనియర్స్ కి కూడా చెప్పి ప్రెషర్ చేసారు.
ఇక వాట్సాప్ లో ఆమె రాసిన రిపోర్ట్స్ పెట్టి అందరిలోనూ హేళన చేయడంతో సైఫ్ మీద ఫిర్యాదు కూడా చేసింది ప్రీతి. అయితే హెచ్ఓడి నాగార్జున రెడ్డి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఆ మరుసటి రోజే ప్రీతి ఇలా ఆత్మహత్య చేసుకోడానికి హానికర ఇంజక్షన్ తీసుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…