Lakshmi Parvathi : ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆగష్టు 1 తేదీన సోమవారం తన స్వగృహం లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆవిడ మరణవార్త నుండి నందమూరి కుటుంబం ఇంకా షాక్ నుండి తెరుకోలేదు. ఇక అప్పుడే రాజకీయ విమర్శలు ఆరోపణలు మొదలైపోయాయి. సాధారణ మరణం అయ్యుంటే అంతగా ఎవరు పట్టించుకునేవారు కాదేమో కానీ ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించడంతో అనుమానాలు బయలుదేరాయి. అసలు చనిపోవాలని నిర్ణయం తీసుకునేంత కష్టాలు ఏమున్నాయి ఉమా మహేశ్వరీ గారికి అనే ఆరాలు మొదలయ్యాయి. నిజానికి పోలీసులు అనుమానస్పద మృతిగా మొదట కేసు నమోదు చేసుకున్నా ఆ తరువాత పోస్టుమార్టం రిపోర్ట్ ఆత్మహత్య గా వెలువడడంవల్ల ఆత్మహత్య గా నిర్ధారించారు. కానీ ఈ ఇష్యూ పై కొంతమంది రాజకీయం చేయడం చాలా బాధకారం. ఇక లక్ష్మి పార్వతి ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఉమా మహేశ్వరి మరణంలో చంద్రబాబు హస్తం ఉంది అన్నట్లు గా మాట్లాడారు.
సుసైడ్ నోట్ ఎక్కడ దాచావ్ చంద్రబాబు…
హరికృష్ణ మరణాన్ని ఇంకా మర్చిపోలేక పోతుంటే ఇపుడు నా కూతురు ఉమా మహేశ్వరి మరణం నన్ను షాక్ కి గురిచేసింది అంటూ మాట్లాడారు. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదంటూ మాట్లాడారు. ఇక ఉమా మహేశ్వరి గారి మరణం లో కూడా చంద్రబాబు హస్తం ఉంది అన్నట్లుగా మాట్లాడారు లక్ష్మి పార్వతి. ఎవరైనా చనిపోతే సుసైడ్ నోట్ ఖచ్చితంగా రాస్తారు. ఉమ చదువుకున్న అమ్మాయి, తనకు చనిపోవాలని అనుకున్నపుడు తాను ఖచ్చితంగా సుసైడ్ నోట్ రాసుంటుంది. ఆ సుసైడ్ నోట్ ను పోలీసులకు దొరకకుండా చంద్రబాబు నాయుడే దాచుంటాడు.
కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య కు కారణం కూడా చంద్రబాబు నాయుడే. అవమానించి ఆత్మహత్య చేసుకునేలా చేసాడు. ఇతనికి శవారాజకీయాలు ముందు నుండి అలవాటే. నా భర్త ఎన్టీఆర్ మరణించడానికి కారణం కూడా ఇతనే. ఆయన చనిపోయే ముందు వాయిస్ రికార్డు చేసిన ఫోన్ ను మటుమాయం చేసాడు చంద్రబాబు, ఇప్పటికి అది బయటకు రాలేదు. కాని ఎన్టీఆర్ సంతానం మాత్రం గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు చంద్రబాబు నాయుడునే నమ్మారు. నందమూరి కుటుంబానికి చంద్రబాబు శనిలా దాపురించాడు అంటూ ఘాటు వాఖ్యలు చేసింది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…