Lakshmi Parvathi : నీ భార్య బస్సులో పారిపోయింది నిజం కాదా… వసుంధర మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసిన లక్ష్మి పార్వతి…!

Lakshmi Parvathi : సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్యగా అందరికీ తెలిసిన లక్ష్మి పార్వతి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మళ్ళీ మీడియా ముందుకు తరచూ వస్తూ ఎన్టీఆర్ కుటుంబం పై విమర్శలు గుప్పిస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి అవకాశం దొరికినపుడల్లా వెన్ను పోటు అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. అయితే ఈసారి ఎన్టీఆర్ కొడుకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి విమర్శలను గుప్పించారు. బాలకృష్ణ ఆయన భార్య వసుంధర గురించి తీవ్ర విమర్శలని చేసారు.

నీ భార్య బస్సులో పారిపోయింది…

హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ గురించి లక్ష్మి పార్వతి గారు మాట్లాడుతూ నా కొడుకు వాళ్ళ బావను నమ్మి తప్పు చేసాడు. లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేసినపుడు కూడా ఎందుకు ఆ పిల్ల గొంతు కొస్తున్నావని అడిగాను, విధి రాత అమ్మ ఏం చేద్దాం అన్నాడు. ఇక తాను వైసీపీ ప్రభుత్వం గురించి విమర్శించడం ఏం బాగోలేదు. హిందూపురంలో ఇప్పటి వరకు నువ్వేం చేసావు. ఈ సారి కాగానే ప్రభుత్వం పుణ్యమా అని అక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. హిందూపురం వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంటారు.

ఎన్టీఆర్ కొడుకని గెలిపిస్తే ఏమీ చేయడం లేదు అంటూ బాధపడతారు. నువ్వు, నీ భార్య, నీ పిఏ కలిసి హిందూపురంలో ఎంత దోచుకున్నారో పత్రికల్లోనే వచ్చింది. నీ భార్య హిందూపురంలో డబ్బు తీసుకుని బస్సులో పారిపోయింది నిజం కాదా, నువ్వు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తావా. ఇక సంస్కారం గురించి నువ్వే మాట్లాడాలి, మొదట నీకు మేలు చేసే వారిని గౌరవించి మళ్ళీ సంస్కారం గురించి మాట్లాడు అంటూ లక్ష్మి పార్వతి ఫైర్ అయ్యారు.