Featured

Lirisha Kunapareddy : వరుడు సినిమా రెమ్యూనరేషన్ ఇంకా ఇవ్వలేదు… ప్రొడ్యూసర్ కి ఫోన్ చేస్తే ఏమన్నాడంటే..: క్యారెక్టర్ ఆర్టిస్ట్ లిరిషా

Lirisha Kunapareddy : వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ గా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నటి లీరీష. లీరీష అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ సూపర్ వుమన్ సరళదేవి అంటే టక్కున గుర్తు పడతారు. వకీల్ సాబ్ సినిమాలో కోర్ట్ సీన్ లో సూపర్ కాప్ గా కనిపించిన లీరీష చాలా ఏళ్లుగా ఇండస్ట్రీ లో ఉన్నా వకీల్ సాబ్ సినిమా తరువాత మంచి గుర్తింపు అవకాశాలను అందుకుంటోంది. సినిమా ఇండస్ట్రీ లో తాను ఎదుర్కొన్న సమస్యలను, సీరియల్స్ లో అవకాశాలను గురించి లీరీష ఇటీవల యూట్యూబ్ లో ఇంటర్వ్యూ లో పంచుకుంది

రెమ్యూనరేషన్ ఎగొట్టారు… పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో ఇలా జరుగుతాయి…..

చాలా మంది చిన్న ఆర్టిస్టులు తరచు సినిమా ఇండస్ట్రీ మీద చేసే కంప్లెయింట్ ఒకటే అదే రెమ్యూనరేషన్ విషయంలో మోసపోయము అని, ఇప్పుడు లీరీష కూనపరెడ్డి కూడా ఇదే విషయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపింది. వరుడు లాంటి పెద్ద సినిమ విషయంలోనే తాను రెమ్యూనరేషన్ సమస్య ఎదుర్కొన్నానని చెప్పారు. నలభై రోజులు షూటింగ్ అయ్యాక సగంపేమెంట్ ఇచ్చారు.

మళ్ళీ అడిగిన మిగిలిన బ్యాలన్స్ ఇవ్వలేదు అంటూ చెప్పారు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ లోనే ఇలాంటివి జరుగుతాయి. కారణం నిర్మాత డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వడు కింద మేనేజర్స్ ఉంటారు వారి వల్ల కమ్యూనికేషన్ సమస్యలు వస్తాయి అంటూ చెప్పారు. ఇక కొన్ని చిన్న సినిమాలకు కూడా పేమెంట్ లు ఇవ్వలేదు ఇప్పటికీ నా బ్యాలన్స్ పేమెంట్ కోసం నిర్మాతకు ఫోన్ చేస్తూనే ఉన్నా ఇప్పటికీ స్పందించరు అంటూ చెప్పారు. ఇక సీరియల్స్ లో నటిస్తున్న లీరీష తమిళ ఇండస్ట్రీ లో నటించాలని ఉందంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

హర్మూజ్ దాటి భారత్ వైపు భారీ ఎల్పీజీ ట్యాంకర్.. ఊరటలో దేశం..!

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్‌కు ఒక కీలక ఊరట లభించింది. దేశానికి అవసరమైన వంటగ్యాస్ సరఫరాలో…

3 minutes ago

హైదరాబాద్‌లో కల్తీ మామిడి పండ్ల దందా బహిర్గతం.. 200 కిలోలు సీజ్..!

వేసవి కాలం రాగానే మార్కెట్‌లలో మామిడి పండ్ల రద్దీ పెరుగుతుంది. అయితే ఈ డిమాండ్‌ను అవకాశంగా తీసుకుని కొందరు వ్యాపారులు…

58 minutes ago

కన్న తండ్రే కిరాతకుడు.. ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలి

కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక ఘటన సమాజాన్ని కలచివేసింది. పసిపాపల నవ్వులతో కళకళలాడాల్సిన ఓ ఇల్లు ఒక్కసారిగా విషాదంలో…

1 hour ago

ఢిల్లీలో భూకంపం షాక్.. రాత్రివేళ పరుగులు తీసిన ప్రజలు

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా భూమి కంపించడం ప్రజల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. కొద్ది సెకన్ల పాటు…

2 hours ago

శ్రీకాకుళంలో కలకలం.. బాదం పాలు తాగి 80 మంది అస్వస్థత

శ్రీకాకుళం జిల్లాలో ఒకేసారి పలువురు అస్వస్థతకు గురవడంతో కలకలం చెలరేగింది. గ్రామీణ మండలం సింగుపురంలో జరిగిన జాతర సందర్భంగా బాదం…

3 hours ago

బావిలో పడిన కారు.. చిన్నారులతో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది…

3 hours ago