Mahesh Babu : సర్కారు వారి పాట సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదలయింది. రెండేళ్ల తరువాత మహేష్ బాబు నుండి వచ్చిన సినిమా కావడంతో అభిమానులు బాగా సందడి చేసారు. ఇక మొదటి రోజు సినిమా మిశ్రమ స్పందనతో ఆడినా కలెక్షన్స్ మాత్రం బాగా వచ్చాయి. ఇక రెండో రోజు మాత్రం కలెక్షన్స్ కొంచెం తగ్గి పర్వాలేదనిపిస్తున్నాయి. సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ నటించింది. ఇక విలన్ గా సముద్రఖని అదరగొట్టారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తో సినిమాను బాగా రన్ చేసాడు దర్శకుడు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ఎమోషన్స్, యాక్షన్స్ సీన్స్ తో అన్ని కలిపి సినిమా ఓవరాల్ గా బాగుంది అనే స్పందన వచ్చింది. ఇక సినిమాపై పనిగట్టుకుని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
సినిమా రన్ టైం 2గంటల 40 నిమిషాల కాగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్లు జరిగింది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు పోగా వెస్ట్ 7 కోట్లకు, ఈస్ట్ 8.50 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 96.50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటకలో 8.50 కోట్ల ముందస్తు బిజినెస్ జరగగా, మిగిలిన ఇండియా 3 కోట్లకు, ఇక ఓవర్సీస్ లో మహేష్ డిమాండ్ కారణంగా 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.
మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో రెండో రోజే 1 మిలియన్ గ్రాస్ ను వసూలు చేసేసింది అని చిత్ర వర్గాలు పోస్టర్ విడుదల చేసారు. దీంతో బ్రేక్ ఈవెన్ రెండో రోజే పూర్తి చేసుకుంటుంది అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు. ఓవర్సీస్ లో 100 కోట్లు వసూలు చేసిన సినిమా మహేష్ వి ఆల్రెడీ 11 ఉన్నాయి.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…