Mahesh Babu -Namrata: మహేష్ బాబుకు ఏ మాత్రం ఖాళీ దొరికిన వెంటనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన తాజాగా మరోసారి తన భార్య పిల్లలతో కలిసి లండన్ వెకేషన్ వెళ్లారు. ఈ క్రమంలోనే లండన్ వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.అయితే ఇందులో మహేష్ పిల్లలు కనిపించలేదు కానీ మహేష్ బాబు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మాత్రం ఉన్నారు.
ఇక వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో నమ్రత చెల్లెలు కూడా ఉండడం విశేషం. ఇలా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి వీరంతా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను షేర్ చేసిన నమ్రత పుడ్ తింటూ ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటూ తమ బాండింగ్ మరింత స్ట్రాంగ్ చేసుకున్నట్లు తెలిపారు.
ఇలా నమ్రత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మహేష్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలలో మహేష్ బాబు కాస్త డిఫరెంట్ లుక్ లో ఉన్నారు. అలాగే ఈయన చాలా యంగ్ గా కనిపిస్తూ ఉండడంతో ఫాన్స్ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్లో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నప్పటికీ మహేష్ బాబు పై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు లేకపోవడంతో మహేష్ వెకేషన్ ప్లాన్ చేశారు.ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా షూటింగ్ పనులలో బిజీ అవుతారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…