Manchu Lakshmi : బాహుబలిలో నటించానందుకు సంతోషంగా ఉంది.. ఆ పాత్రకు ముందు నన్ను అడిగారు.. కానీ ఎవరూ చేయలేని పాత్ర నేను చేసాను : మంచు లక్ష్మి

Manchu Lakshmi : దర్శకాధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసినా చాలు అనుకునే ఆర్టిస్టులు ఉన్నారు. ఒక్కసారైనా రాజమౌళి తో పని చేయాలని అనుకునేవాళ్ళు ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. అలాంటిది బాహుబలి లాంటి సినిమాలో కీలక పాత్రలో చేయమని అడిగితే మన మంచు లక్ష్మక్క నేను చేయను అని చెప్పిందట. పైగా ఆ సినిమా హిట్ అయినందుకు చాలా గర్వంగా ఉంది, ఆ పాత్ర చేయనందుకు ఆనందంగా ఉంది అంటూ చెప్పింది.

ఆ తరహా పాత్రలు చేయాలని అనుకోవడం లేదు…

మంచు లక్ష్మి హాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ లను చేసి ఇండియా వచ్చాక తెలుగులో ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాలో విలన్ పాత్రలో ఐరేంద్రి అనే మంత్రగత్తే పాత్రలో నటించింది. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలినా ఆ సినిమాలో పాత్ర తన ఆల్ టైం ఫేవరెట్ అంటూ చెప్పింది. ఇక విభిన్న తరహా పాత్రలు చేయాలని అనుకుంటున్నట్లు చెబుతూ బాహుబలి లో శివగామి పాత్రకు మొదట నన్నే అడిగినా నేను చేయను అని చెప్పాను అంటూ సోషల్ మీడియాలో పంచుకుంది.

ప్రభాస్ కి తల్లిగా నటిస్తే ఇక ఆ తరువాత ఆ తరహా పాత్రలే వస్తాయని అలాంటి పాత్రలే చేయడం నాకు ఇష్టం లేదంటూ లక్ష్మి చెప్పింది. ఇక ఆ సినిమా విడుదల అయి హిట్ అయ్యాక చాలా గర్వంగా ఫీల్ అయ్యానంటూ చెప్పింది. ఆ పాత్ర నాకు సెట్ కాదని చేయనందుకు హ్యాపీ గా ఫీల్ అయినట్లు చెప్పింది. తాజాగా మంచు లక్ష్మి మలయాళంలో మోహన్ లాల్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. గ్రాండ్ గా మలయాళం లో లాంచ్ అవుతోంది.