ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్రజలు నానాతంటాలు పడుతున్న విషయం తెలిసిందే.. అనేక మార్గాల ద్వారా ఆక్సిజన్ తరలిస్తున్నా కూడా ఆసుపత్రులలో సరైన సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇటువంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక అద్బుతమైన కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారు.
రక్తం అందక ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998లో మెగాస్టార్ చిరంజీవి “చిరంజీవి బ్లడ్ బ్యాంక్” ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తాజా విపత్కర పరిస్తితుల్లో మరోసారి గొప్ప సంకల్పంతో ముందుకు వస్తున్నారు మెగాస్టార్. ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోకూడదనే సద్దుదేశంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలోనూ “చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు” లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్వయంగా ట్విట్టర్ వేదికగా అఫీషియల్ స్టేట్మెంట్ విడుదల చేసారు.
వచ్చే వారం రోజుల్లో ప్రజలకు ఈ ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపిందిచిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. ఈ ఆక్సిజన్ బ్యాంకులకు సంబంధించిన కార్యకాలాపాలను హీరో రామ్ చరణ్ దగ్గరుండి చూస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…